Anushka Shetty: స్వీటీ అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ అనుష్క శెట్టి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు. స్వీటీగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఈమె అనంతరం అనుష్కకగా మారిపోయారు. సూపర్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యారని చెప్పాలి.
కెరియర్ మొదట్లో గ్లామరస్ పాత్రలలో నటించిన అనుష్క అనంతరం అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో అనుష్క తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఇలా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో కూడా నటించారు. అయితే సైజ్ జీరో సినిమాలో ఈమె నటించి అధిక శరీర బరువు కావడంతో ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయారని చెప్పాలి.
ఇలా శరీర బరువు తగ్గడం కోసం అనుష్క ఎన్నో ఇబ్బందులు పడ్డారు.ఈ విధంగా శరీర బరువు తగ్గినటువంటి అనుష్క అనంతరం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా పానుండి స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమానే అనుష్కకు ఆఖరి సినిమా అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా తర్వాత అనుష్క సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని భావించారట అందుకే ఈ సినిమా విడుదలైన అనంతరం ఈమె సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారంటూ ఓ వార్త సెన్సేషనల్ గా మారింది. ఇలా వెండి తెర జేజమ్మగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఇకపై వెండితెరపై కనిపించదు అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…