AP: వాలంటీర్లకు చుక్కలు చూపిస్తున్న కొత్త ప్రభుత్వం.. కేసులు పెట్టమంటున్న అచ్చం నాయుడు!

AP: 2019 ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపీ పార్టీ అఖండమైన విజయాన్ని సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే .ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమించి ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలన్నీ గడప వద్దకు అందేలా చేశారు.

ఈ వాలంటీర్ వ్యవస్థను అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. గోన సంచలు మోసే ఉద్యోగం అంటూ విమర్శలు కురిపించారు. ఇక తీరా ఎన్నికల సమయానికి వాలంటీర్ వ్యవస్థని ప్రధాన అంశంగా చేసుకొని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ ప్రభుత్వం ఐదువేల రూపాయల జీతం ఇస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాలంటీర్లు విధులలో ఉండకూడదని వారి చేత రాజీనామాలు చేయించారు అయితే ప్రస్తుతం రాజీనామా చేసిన వారిని తీసుకోవడానికి వీలు లేదంటూ తెలియజేశారు. దీంతో ఎంతో మంది వాలంటీర్లు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, తిరిగి వాలంటీర్లుగా మమ్మల్ని తీసుకోవాలని వేడుకుంటున్నారు.

కేసులు పెట్టండి..
ఈ క్రమంలోనే వాలంటీర్ల పట్ల పలువురు మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా అచ్చం నాయుడు అప్పుడు మీతో ఎవరైతే రాజీనామా చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా మరో మంత్రి రాజీనామా చేసిన వారిని తిరిగి తీసుకునే ప్రసక్తే లేదంటూ వెల్లడించారు. ఇలా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ పై ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వాలంటీర్లలో అయోమయం చోటుచేసుకుంది.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2Frealindiaherald%2Fstatus%2F1798190452056944974&widget=Video

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago