Roja: సినీనటి మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తాజాగా ట్విట్టర్ వేదిక గారు రుషికొండ భవనం పై స్పందించారు. జగన్మోహన్ రెడ్డి హయామంలో సుమారు 500 కోట్లకు పైగా నిధులతో వైజాగ్ ఋషికొండ ప్రాంతంలో అద్భుతమైన భవనాలను నిర్మించిన సంగతి తెలిసిందే.అయితే ఇవి కేవలం ప్రభుత్వ భవనాలు మాదిరిగానే నిర్మించారు అయితే ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ఈ భవనంలోకి వెళ్లి దానిని తప్పుగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఋషికొండ భవనం పై ఇప్పటికే మాజీ మంత్రులు అమర్నాథ్ అంబంటి రాంబాబు వంటి వారు స్పందించారు. తాజాగా మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా స్పందించారు. ఈ భవనం పై ఈమె ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలను వేస్తూ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక భవనాలను నిర్మించడం తప్ప అంటూ ఈమె ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చేదిద్దడం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ భవనాలను నిర్మించామని తెలిపారు.
వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా…61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం… ఇందులో అక్రమం ఎక్కడుంది. హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రభుత్వ భవనాలు..
లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది.మా జగనన్న పైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో మా వైఎస్ఆర్సిపి పార్టీ వెన్ను చూపేది లేదు… వెనకడుగు వేసేది లేదంటూ ఈమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…