Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈనెల ఆరవ తేదీ వీరిద్దరూ ముఖాముఖి భేటీ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ లేఖ రాయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఎందుకు లేఖ రాశారు అందులో ఏముంది అనే విషయానికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు పూర్తయింది అయితే ఇప్పటివరకు కూడా విభజన హామీల విషయంలో ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఈనెల ఆరవ తేదీ ముఖాముఖి బేటిలో విభజన హామీల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలుస్తుంది.
పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. పునర్ వ్యవస్థీకరణ చట్టం నుండి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ సమస్యలను చాలా శ్రద్ధతో, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.
విభజన హామీలపై చర్చలు..
ఇక ఈ విషయాలు గురించి చర్చించిన తర్వాత రెండు రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈనెల బేటీ కాబోతున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…