General News

జగన్ సంచలనం.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ!

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నేటి నుంచి రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా పునాదిపాడులో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఈరోజు ఉదయం 10.20 గంటలకు పునాదిపాడుకు చేరుకుని జగన్ మొదట నాడు నేడు పనులను పరిశీలించనున్నారు. ఆ తరువాత విద్యార్థులతో వివిధ అంశాలకు సంబంధించి ముచ్చటించనున్నారు.

అనంతరం సీఎం జగన్ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కిట్లను అందించనున్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం స్కూల్ బ్యాగ్, జత బూట్లు, మూడు జతల యూనిఫాం, సాక్సులు, టెక్స్ట్ బుక్స్, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించనుంది. ప్రభుత్వం విద్యార్థులకు స్టూడెంట్ కిట్ ఇస్తూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఇలా విద్యార్థులకు కిట్లు అందిస్తున్న ప్రభుత్వం జగన్ సర్కార్ మాత్రమే కావడంతో ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరోవైపు జగన్ సర్కార్ విద్యార్థుల తల్లుల ఖాతాలలో నగదు జమ చేయడానికి సిద్ధమవుతోంది. యూనీఫాం కుట్టుకూలి కోసం ప్రభుత్వంనగదు జమ చేయనుంది. ఇందుకోసం జగన్ సర్కార్ 650 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలుస్తోంది. 42,34,322 మంది విద్యార్థులు జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీల్లో చదివే విద్యార్థులకు కిట్లు అందాయని సమాచారం.

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు మాట్లాడుతూ విద్యార్థులకు కిట్ రాకపోయినా, కిట్ లో వస్తువులు మిస్ అయినా ఆందోళన చెందకుండా స్కూల్ హెడ్ మాస్టర్ లేదా మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని సూచనలు చేసింది. కిట్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 91212 96051, 91212 96052 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఫోన్ లైన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago