నింగిలో వేల సంఖ్యలో గ్రహశకలాలు వివిధ మార్గాల్లో ప్రయాణం సాగిస్తుంటాయి. ఈ గ్రహ శకలాలు ఎక్కువ సంఖ్యలో మూలకాలను కలిగి ఉంటాయి. ఇష్టం వచ్చినట్లుగా తిరిగే ఈ గ్రహశకలాలు కొన్నిసార్లు భూమికి దగ్గరగా కూడా వస్తూ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం ఒక గ్రహశకలం భూమికి సమీపంగా వెళ్లగా తాజాగా మరొక గ్రహశకలం దూసుకొచ్చింది. జూపిటర్, మార్స్ గ్రహాల మధ్యలో ఓ సైషే 19 అనే గ్రహశకలం పరిభ్రమణం చేస్తోంది.
పలు సందర్భాల్లో భూమి వాతావరణంలోకి గ్రహశకలాలు ప్రవేశిస్తే అవి చిన్న చిన్న ముక్కలు కావడంతో పాటు భూమిపై పడుతుంటాయి. అయితే ఓ సైషే గ్రహశకలం మాత్రం వాటికి భిన్నమైనది. ఈ గ్రహ శకలంలో అంచనాలకు అందని స్థాయిలో బంగారం, వజ్రాలు ఉంటాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాల ప్రకారం భూమిపైకి ఈ గ్రహ శకలాన్ని తీసుకొస్తే ఈ భూమిపై పేదవాడు అనే వాడే ఉండడు.
నాసా శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం గురించి అన్ని రకాల పరిశోధనలు చేస్తున్నారు. ఈ గ్రహశకలం ఖరీదు 8000 క్వాడ్రిలియన్ పౌండ్లు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమిపై నివశించే ప్రతి ఒక్కరినీ 9,000 కోట్ల రూపాయలకు ఈ సంపద అధిపతిని చేయగలదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఏజెన్సీ సహాయంతో అక్కడికి రోబోను పంపించి ఆ గ్రహశకలంలో ఉన్న బంగారం, వజ్రాలను చూడాలని నాసా ప్రయత్నిస్తోంది.
అయితే కొన్ని సందర్భల్లో గ్రహశకలాల వల్ల మానవాళి ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అయితే అరుదుగా మాత్రమే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో ప్రజలు పెద్దగా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో గ్రహశకలాలు భూమి వైపుకు వస్తాయని వాటిలో కొన్ని మాత్రమే భూమిని తాకుతాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…