ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీతో పలు ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యభివృద్ధి ని పెంపొందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సాఫ్ట్ వేర్ రంగానికి సంబంధించిన యువతలో స్కిల్ డెవలప్ చేయడం కోసం ఏపీ శిక్షణా విద్యా శాఖ – మైక్రోసాఫ్ట్ సంస్థ ఇక మీదట కీలక భాగస్వాములు కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దే విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోందని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 1,62,000 వేల మంది యువతకు శిక్షణ నిచ్చి.. వారిని నిఫుణులుగా మార్చి ధృవపత్రాల అందజేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలియజేసింది.
జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కువగా విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే కలలుగన్న ప్రతి ఒక్కరు తమ కలను సహకారం చేసుకోవడానికి వీలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటి కార్యక్రమాలలో చేపట్టి విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు శిక్షణ కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వంటి కార్యక్రమాలను చేపడుతోంది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…