General News

ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఏపీ సర్కార్ ఒప్పందం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీతో పలు ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యభివృద్ధి ని పెంపొందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సాఫ్ట్ వేర్ రంగానికి సంబంధించిన యువతలో స్కిల్ డెవలప్ చేయడం కోసం ఏపీ శిక్షణా విద్యా శాఖ – మైక్రోసాఫ్ట్ సంస్థ ఇక మీదట కీలక భాగస్వాములు కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దే విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోందని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 1,62,000 వేల మంది యువతకు శిక్షణ నిచ్చి.. వారిని నిఫుణులుగా మార్చి ధృవపత్రాల అందజేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలియజేసింది.

జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కువగా విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే కలలుగన్న ప్రతి ఒక్కరు తమ కలను సహకారం చేసుకోవడానికి వీలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటి కార్యక్రమాలలో చేపట్టి విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు శిక్షణ కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వంటి కార్యక్రమాలను చేపడుతోంది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

21 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

21 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago