Breaking News: గుండెపోటుతో అకాలమరణం పొందారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి…!
Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి(50) గుండెపోటు వచ్చింది. వెంటనే సహచరులు, బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి పల్స్ దొరకడం కష్టంగా ఉందని.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇది వెల్లడించిన కొద్ది సమయం తర్వాతనే అతడు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. అతడి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక అతడి మరణ వార్త విన్న వైసీపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు తరలి వస్తున్నారు.
మంత్రి మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోకవర్గం నుంచి అతడు 2019లో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి పదవి పొందాడు. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవసరమని, ఐటీ బ్రాండింగ్పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పరితపించేవారని మంత్రి గౌతమ్ రెడ్డి పరితపించేవారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఇటీవల మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పాడు. ఐటీ ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షణ అవసరం అని దానికి తగ్గట్లు ఏర్పాట్లు ప్రభుత్వం కల్పిస్తుందని ఎన్నో సార్లు తెలిపాడు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…