Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి(50) గుండెపోటు వచ్చింది. వెంటనే సహచరులు, బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి పల్స్ దొరకడం కష్టంగా ఉందని.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇది వెల్లడించిన కొద్ది సమయం తర్వాతనే అతడు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. అతడి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక అతడి మరణ వార్త విన్న వైసీపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు తరలి వస్తున్నారు.

మంత్రి మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలి…
ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోకవర్గం నుంచి అతడు 2019లో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి పదవి పొందాడు. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవసరమని, ఐటీ బ్రాండింగ్పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పరితపించేవారని మంత్రి గౌతమ్ రెడ్డి పరితపించేవారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఇటీవల మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పాడు. ఐటీ ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షణ అవసరం అని దానికి తగ్గట్లు ఏర్పాట్లు ప్రభుత్వం కల్పిస్తుందని ఎన్నో సార్లు తెలిపాడు.



































