ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా..!!

కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించడంతో ఏపీలో పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయగా.. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఈనెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తెలిపారు.

అయితే ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, కేవలం జరగాల్సిన ఎన్నికలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ తెలిపారు. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికైన వారు మాత్రం కొనసాగుతారని స్పష్టం చేశారు.

ఈ ఎన్నిక ప్రక్రియ నిలిపివేత మాత్రమేనని, రద్దు కాదనే విషయాన్ని రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆరువారాల అనంతరం తిరిగి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. వాయిదా ప్రక్రియ ముగిసిన తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించి పంచాయితీల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. నామినేషన్ వేసిన వారిని భయభ్రాంతులకి గురిచేయకూడదన్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే అన్ని స్కూళ్లు, మాల్స్ మూసేసిందని, తాము కూడా అత్యవసర సమీక్ష నిర్వహించిన తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఈ రోజు రాశి ఫలాలు.. వృశ్చిక రాశికి శుభసూచనలు, మిగతావారికి హెచ్చరికలు!

2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…

2 minutes ago

శని బాధలకు ఉపశమనం.. గుజరాత్‌లోని ఈ హనుమ ఆలయం ఎందుకు ప్రత్యేకం?

గుజరాత్‌లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…

32 minutes ago

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

10 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

10 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

10 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

10 hours ago