AP Politics: 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు పెద్ద ఎత్తున తమ పార్టీలను బలోపేతం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్నటువంటి జగనన్న మా భవిష్యత్తు నువ్వే మా నమ్మకం జగనన్న అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నినాదాలు వినిపించాలి అంటూ వైఎస్ఆర్సిపి ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
జగన్ మోహన్ రెడ్డిని తన సొంత చెల్లి షర్మిల తల్లి తన బావ అనిల్ బాబాయ్ కూతురు సునీత నమ్మడం లేదు ఇక రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అంటూ ఈయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ నువ్వే మా దరిద్రం అంటూ చెబుతూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం జగనన్నే మా నమ్మకం అంటూ నినాదాలు చేయమని చెబుతున్నారు. సజ్జల ఇలా మాట్లాడటం చాలా విడ్డూరంగా అనిపిస్తుందని వర్ల రామయ్య తెలిపారు. ఇక ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి అంటూ ఈయన ప్రశ్నించారు.
జగన్ నాలుగు సంవత్సరాల పాలనలో ఏకంగా 3000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకు ఆయనని నమ్మాలా? రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకపోవడం వల్ల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి జగన్ మా నమ్మకం అని నమ్మాలా? అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను తప్పారు.మద్యపానం నిషేధం అన్నావు మద్యం తాగి ఎంతో మంది మహిళల పుస్తెలు తెగిపోయాయి.సొంత బాబాయ్ హత్య కేసులో నిందితుడిని పట్టుకోలేనటువంటి చేతకాన్ని ముఖ్యమంత్రిని ఎందుకు నమ్మాలి అంటూ ఈయన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…