ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 18 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈమెయిల్/రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 22. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారక https://apmdc.ap.gov.in/వెబ్ సైట్ చూడవచ్చు.
ఏపీఎండీసీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు సంబంధించిన ఖాళీలను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి విభాగాలలో రెండు జనరల్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంబీఏ,సీఏ ఉత్తీర్ణతతో పాటు ఐసీఎస్ఐ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సంబంధిత నైపుణ్యాలు ఉండాలి. అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 30 నాటికి 54 సంవత్సరాలకు మించి ఉండకూడదు.
ఎన్విరాన్మెంటల్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ఎఫ్&ఏజ/ట్యాక్సేషన్, సీఎస్ఆర్, సివిల్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 5 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.డిగ్రీతోపాటు ఎంబీఏ(మార్కెటింగ్), సీఏ, ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఏప్రిల్ 30 నాటికి 45 సంవత్సరాలు మించి ఉండకూడదు.
సర్వే/జీఐఎస్, ఫైనాన్స్, కాంట్రాక్ట్ అడ్మిన్, ఐటీ, మైనింగ్, కంపెనీ సెక్రటరీ ఈ విభాగంలో కాళీగా ఉన్న 11 మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు /డిప్లొమా, ఇంజనీరింగ్, ఐసీఎస్ఐ సర్టిఫికెట్, బీకాంతోపాటు సీఏ/ఐసీడబ్య్లూఏ, ఎంజీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఏప్రిల్ 30 నాటికి 40 సంవత్సరాల వయసు మించకూడదు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారికి మే 22 చివరి తేదీ
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…