Political News

Kirrak RP : ఆ నలుగురు వైసీపీ నేతలు మనుషులా? అడవి జంతువులా? తీవ్ర విమర్శలు చేసిన కిరాక్ ఆర్పీ !

Kirrak RP : ప్రముఖ నటుడు కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన నలుగురు ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. “వారు మనుషులేనా? లేక అడవి జంతువులా?” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. కొమ్మినేని, కృష్ణంరాజుల లైవ్ డిబేట్‌లో ఏం జరిగిందో అందరూ చూశారని, అలాంటి పరిస్థితుల్లో కొమ్మినేని అరెస్టును అక్రమం అని ఎలా అంటారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Are those four YSRCP leaders human? Wild animals? Kirak RP

అంతేకాదు, అమరావతి ఆడపడుచుల మానాలను అవమానిస్తుంటే ఆర్కే రోజా, లక్ష్మీపార్వతి, శ్యామల వంటి మహిళా నేతలు ఎక్కడ దాక్కున్నారని కిరాక్ ఆర్పీ నిలదీశారు. మహిళాభ్యుదయం గురించి మాట్లాడే వీళ్ళు, ఇలాంటి విషయాల్లో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. భారతీరెడ్డి నడిపే మీడియాలో సాటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

telugudesk

Recent Posts

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

2 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

2 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

2 hours ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

2 hours ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

2 hours ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

3 hours ago