కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ కోసం కొందరు సరైన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంటే మరికొందరు విటమిన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడుతున్నారు. మరి విటమిన్ ట్యాబ్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా..? కీడు చేస్తాయా..? అనే ప్రశ్నకు విటమిన్ ట్యాబ్లెట్ల వల్ల మన శరీరానికి జరిగే మంచి కంటే చెడే ఎక్కువ అని వైద్యనిపుణులు చెబుతున్నారు.
వైద్యుల సలహాలు, సూచనలను తీసుకోకుండా విటమిన్ ట్యాబ్లెట్లను వాడితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని వెల్లడిస్తున్నారు. శరీరంలో విటమిన్ల స్థాయిని పెంచుకోవడం కోసం ట్యాబ్లెట్లపై ఆధారపడితే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టేనని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెల్లడిస్తోంది. ఇష్టానుసారం విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
శరీరంలో విటమిన్ల స్థాయి పెరిగితే కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. గొంతునొప్పి, అలసట సమస్యలు వీరిని ఎక్కువగా వేధిస్తాయి. విటమిన్లు ట్యాబ్లెట్ల ద్వారా కంటే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి చేరితే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజూ కొంత సమయం ఎండలో తిరిగితే విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడిన వారిలో కాల్షియం లెవెల్స్ పెరిగి కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.
శరీరంలో విటమిన్ ఇ ఎక్కువైతే కంటి కాంతిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పప్పు దినుసులు, కూరగాయలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు అన్నీ లభిస్తాయి. తగిన స్థాయిలో విటమిన్లు తీసుకోవడం వల్ల ఏ సమస్య లేదని విటమిన్ల స్థాయి పెరిగితే మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. మోతాదుకు మించి విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటే అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపి అవయవాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…