Allu Arjun: నువ్వేం హీరో అంటూ…. అల్లుఅర్జున్ పై బాలీవుడ్ సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్!
Allu Arjun:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ పుష్ప అనే పాన్ ఇండియా చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువగా కలెక్షన్లను వసూలు చేయడమే కాకుండా అత్యధిక రికార్డులను నెలకొల్పింది.ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప సినిమాకు అందులో నటించిన అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిందని చెప్పాలి.
ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రెటీలు పుష్ప సినిమా అల్లు అర్జున్ నటన పై ప్రశంసలు కురిపించారు. థియేటర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను రెట్టింపు సందడి చేస్తోందని చెప్పాలి.ఇప్పటికే ఈ సినిమా 350 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, అలియా వంటి తదితరులు అల్లు అర్జున్ పై అతని నటన పై ప్రశంసలు కురిపిస్తూ ఆయనకు అభిమానులుగా మారిపోయారు.ఈ క్రమంలోనే మరొక బాలీవుడ్ సీనియర్ హీరో సైతం అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యానని ఈ సందర్భంగా తెలియజేశారు.
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ నటన పై ప్రశంసలు కురిపించారు. తాజాగా పుష్ప సినిమా చూశాను అల్లు అర్జున్ నువ్వేం హీరో వయ్యా….అదేమి నటన చాలా అద్భుతంగా చేశావు నేను కూడా నీ నటనకు అభిమానిగా మారిపోయాను అంటూ అతని నటనపై ప్రశంసలు కురిపించారు. పుష్ప సినిమా చూస్తున్నంతసేపు 1990లలో నేను నటించిన సినిమాలే గుర్తుకొస్తున్నాయి అంటూ మాట్లాడారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మిథున్ చక్రవర్తి కూడా బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్తో డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో మిథున్ చక్రవర్తి ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…