Latha Mangeshkar:లతా మంగేష్కర్ కోసం సంపాదించిందంతా ఇచ్చేసిన ఆటో డ్రైవర్.. అతనేవరంటే?
Latha Mangeshkar:ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మధురమైన గాత్రంలో కేవలం భారతదేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలు గెల్చుకున్నారు లతా మంగేష్కర్. కాగా ఈ నెల 8న కరోనా బారిన పడిన ఆమె ప్రస్తుతం ముంబయి బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వయసు రీత్యా ఐసీయూలో ఉంచి ఆమెకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. కాగా మంగేష్కర్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై గురించి ఆమెను పరీక్షిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పందించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని… అయితే ఆమెను ఇంకా ఐసీయూలోనే ఉంచి పరిశీలిస్తున్నామని తెలిపారు. లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని… ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్ లతా మంగేష్కర్ కోసం చేసిన ఓ పనికి అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు.mu
ముంబయి పట్టణంలో నివసించే సత్యవాన్ గీతే లతా మంగేష్కర్కి పెద్ద అభిమాని. లతా మంగేష్కర్ను అతను సరస్వతి దేవి రూపంగా భావిస్తాడు. అందుకే తన జీవనాధారమైన ఆటోను కూడా గాయని బొమ్మలతోనే అందంగా అలంకరించాడు. తన ఆటోలో కూడా ఆమె ఆలపించిన పాటలనే వింటూ ఉంటాడు. కాగా లతా మంగేష్కర్ కరోనాతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని నిరంతరం ప్రార్థనలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను ఆమె ఆరోగ్య ఖర్చుల కోసం దానం చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…