ప్రస్తుతం భారతదేశంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. ఇతని దగ్గర మందు తీసుకున్నవారి ఆరోగ్యం నిమిషాలలో కుదుటపడుతుందని, ఈ మందు ద్వారా ఎంతో మంది తమ ప్రాణాలను దక్కించుకున్నారని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆయుర్వేద మందు పై ప్రభుత్వం నిషేధం విధించి ఈ మందు పై CCRAS (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్) అధ్యయనం చేపట్టాలని సూచించింది. అయితే ఏ అధ్యయనానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ అధ్యయనంలో భాగంగా అధికారులు ఇప్పటి వరకు ఆనందయ్య దగ్గర ఎంతమంది మందు తీసుకున్నారు, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏవిధంగా ఉందో అనే విషయం గురించి ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న బాధితులకు సోమవారం నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్న నేపథ్యంలో 92 మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు, అదేవిధంగా 42 మంది గ్రామస్తులు ఆనందయ్య వద్ద మందు తీసుకోలేదని చెబుతున్నారు. అయితే ఆనందయ్య దగ్గర మందు కోసం వచ్చిన వారు వచ్చినట్టుగా మందు తీసుకు వెళ్తున్నారని, ఎవరు కూడా అతనికి ఫోన్ నెంబర్ లేదా ఇతర వివరాలను కానీ తెలుపలేదని అధికారులు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న బాధితుల వివరాలు తెలియకపోతే ఈ అధ్యయనం ఏ విధంగా చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాలు తెలిస్తే తప్ప నివేదిక తయారు చేయలేమని అధికారులు తెలియజేశారు. ఇటువంటి సమయంలో ఆనందయ్య మందు పై అధ్యయనం చేయడం మరింత ఆలస్యం కావచ్చని, ఈ మందు ఇప్పట్లో పంపిణీ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న వారి వివరాలు తెలిస్తే కానీ నివేదిక ఇవ్వలేరు,నివేదిక ఇవ్వకపోతే ప్రభుత్వం ఈ మందు సరఫరాకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…