General News

ఆవుకు ఆలింగనం.. విదేశాల్లో ట్రెండ్.. ఎందుకంటే?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ కరోనా పరిస్థితుల వల్ల ప్రజల మధ్య దూరం పెరిగిపోయింది. ఒకరికొకరు దగ్గరగా నిలబడి మాట్లాడాలన్నా ఎంతో భయపడుతున్నారు. ఈ క్రమంలోనే సొంత వారిని సైతం దూరంగా పెట్టడం వల్ల ప్రతి ఒక్కరిలో మానసిక ఆందోళన పెరుగుతున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా మానసిక ఒత్తిడి కలిగినప్పుడు, మన దగ్గర వారిని గుండెలకు హత్తుకోవడం ద్వారా మనలో ఏర్పడిన ఆందోళన పూర్తిగా తగ్గిపోయి మనసు కుదుటపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.దీని కోసం ఉత్తమమైన ఛాయిస్‌ గోవులు అని వారు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఈ ట్రెండ్ నెదర్లాండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.ఈ క్రమంలోనే ఆవులను ఆలింగనం చేసుకోవడం ప్రస్తుతం విదేశాలలో ట్రెండ్ గా మారిపోయింది. అదేవిధంగా జంతువులను హత్తుకోవడం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందని
డచ్‌ ప్రావిన్స్‌లో చాలా కాలం క్రితమే ఈ విధానాన్ని ప్రారంభించారు. 

ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఆవులను ఆలింగనం చేసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ఈ విధంగా ఆవులను ఆలింగనం చేసుకున్న సమయంలో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్ విడుదలవుతుందని అది ఓ థెరపీలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనుషులు జంతువులను ఆలింగనం చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

42 minutes ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

1 hour ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

1 hour ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

1 hour ago

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…

2 hours ago

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…

2 hours ago