ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ కరోనా పరిస్థితుల వల్ల ప్రజల మధ్య దూరం పెరిగిపోయింది. ఒకరికొకరు దగ్గరగా నిలబడి మాట్లాడాలన్నా ఎంతో భయపడుతున్నారు. ఈ క్రమంలోనే సొంత వారిని సైతం దూరంగా పెట్టడం వల్ల ప్రతి ఒక్కరిలో మానసిక ఆందోళన పెరుగుతున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా మానసిక ఒత్తిడి కలిగినప్పుడు, మన దగ్గర వారిని గుండెలకు హత్తుకోవడం ద్వారా మనలో ఏర్పడిన ఆందోళన పూర్తిగా తగ్గిపోయి మనసు కుదుటపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.దీని కోసం ఉత్తమమైన ఛాయిస్ గోవులు అని వారు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఈ ట్రెండ్ నెదర్లాండ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.ఈ క్రమంలోనే ఆవులను ఆలింగనం చేసుకోవడం ప్రస్తుతం విదేశాలలో ట్రెండ్ గా మారిపోయింది. అదేవిధంగా జంతువులను హత్తుకోవడం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందని
డచ్ ప్రావిన్స్లో చాలా కాలం క్రితమే ఈ విధానాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఆవులను ఆలింగనం చేసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ఈ విధంగా ఆవులను ఆలింగనం చేసుకున్న సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుందని అది ఓ థెరపీలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనుషులు జంతువులను ఆలింగనం చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























