Babu Gogineni: దేవి నాగవల్లి వర్సెస్ విశ్వక్ సేన్ ఇద్దరిలో తప్పెవరిది… ఎవరు క్షమాపణ చెప్పాలి: బాబు గోగినేని
Babu Gogineni: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో యాంకర్ దేవీ నాగవల్లి, విశ్వక్ సేన్ వ్యవహారం తీవ్ర స్థాయిలో ముదురుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది ఎవరు క్షమాపణ చెప్పాలి అనే విషయం గురించి పెద్ద ఎత్తున పలువురు స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొందరు దేవి నాగవల్లికి మద్దతు తెలపడం మరికొందరు హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలబడ్డారు. అయితే ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం కార్యకర్త బాబు గోగినేని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ పోస్ట్ చేస్తూ క్షమాపణ చెప్పాలి అనే విషయం వెల్లడించారు.
ఈ సందర్భంగా బాబు గోగినేని మాట్లాడుతూ… విశ్వక్ సేన్ యాంకర్ ను అనకూడని మాట అన్నారు. అయితే ఈ వీడియో మాత్రమే విడుదల అయింది.విశ్వక్ సేన్ ఆ మాట అనడానికి ముందు యాంకర్ ఎలాంటి మాటలు మాట్లాడరు అనే విషయం గురించి వీడియో లేదు.
విశ్వక్ సేన్ తన ఫ్రాంక్ వీడియో డిబేట్ లో దేవి నాగవల్లి ఆయనని పాగల్ సేన్, డిప్రెషడ్ అంటూ సంబోధించారు. ఇలా మాట్లాడటం ఇండియన్ మెంటల్ యాక్ట్ ను ఉల్లంఘించినట్లు. యాంకర్ అలా మాట్లాడటంతో పదేపదే విశ్వక్ సేన్ మాటలు అదుపులో ఉంచుకొని డిప్రెషడ్ గురించి మాట్లాడే హక్కు లేదని తెలియజేశాడు.
విశ్వక్ సేన్ మాటలు నచ్చలేదు యాంకర్ తనని స్టూడియో నుంచి బయటకు వెళ్ళమని అరిచారు. ఆ సమయంలో హీరో విశ్వక్ సేన్ F*** అనే అభ్యంతరకర పదాన్ని ఉపయోగించారు. అసలు ఆయనని డిబేట్ ఆహ్వానించింది టీవీ9 వాళ్ళు రమ్మని ఆయన మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతూ బయటికి వెళ్ళడం తప్పు.
ఇలా జరిగిన ఈ మొత్తం వ్యవహారాన్ని టీవీ9 డిలీట్ చేసింది. అయితే ఈ వ్యవహారం జరగడానికి కారణం దేవి నాగవల్లి తనని డిప్రెషడ్ గెటవుట్ అనటం వల్లే తలెత్తింది. ఇక దేవి నాగవల్లి విశ్వక్ అన్న మాటలకు క్షమాపణ కూడా చెప్పారు. ఇక గతంలో జరిగిన విషయం గురించి ప్రస్తావిస్తూ డీజే టిల్లు సమయంలో దేవి నాగవల్లి ‘మీరు ఉమనైజరా? అని ప్రశ్నించడం ఎంతవరకు సబబు.
స్టూడియోలో విశ్వక్సేన్ విషయంలో దేవి నాగవల్లి చేసిన పనికి.. ఆమెకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలి. దాంతోపాటు ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రవర్తించినందుకు విశ్వక్ సేన్ కూడా సారీ చెప్పాలి. చివరికి దేవి నాగవల్లి చేసిన దాన్ని జర్నలిజం అనలేం అంటూ బాబు గోగినేని ఈ వ్యవహారంపై స్పందించారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…