Babu Gogineni: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో యాంకర్ దేవీ నాగవల్లి, విశ్వక్ సేన్ వ్యవహారం తీవ్ర స్థాయిలో ముదురుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది ఎవరు క్షమాపణ చెప్పాలి అనే విషయం గురించి పెద్ద ఎత్తున పలువురు స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొందరు దేవి నాగవల్లికి మద్దతు తెలపడం మరికొందరు హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలబడ్డారు. అయితే ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం కార్యకర్త బాబు గోగినేని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ పోస్ట్ చేస్తూ క్షమాపణ చెప్పాలి అనే విషయం వెల్లడించారు.Babu Gogineni: దేవి నాగవల్లి వర్సెస్ విశ్వక్ సేన్ ఇద్దరిలో తప్పెవరిది… ఎవరు క్షమాపణ చెప్పాలి: బాబు గోగినేని
ఈ సందర్భంగా బాబు గోగినేని మాట్లాడుతూ… విశ్వక్ సేన్ యాంకర్ ను అనకూడని మాట అన్నారు. అయితే ఈ వీడియో మాత్రమే విడుదల అయింది.విశ్వక్ సేన్ ఆ మాట అనడానికి ముందు యాంకర్ ఎలాంటి మాటలు మాట్లాడరు అనే విషయం గురించి వీడియో లేదు.Babu Gogineni: దేవి నాగవల్లి వర్సెస్ విశ్వక్ సేన్ ఇద్దరిలో తప్పెవరిది… ఎవరు క్షమాపణ చెప్పాలి: బాబు గోగినేని
విశ్వక్ సేన్ తన ఫ్రాంక్ వీడియో డిబేట్ లో దేవి నాగవల్లి ఆయనని పాగల్ సేన్, డిప్రెషడ్ అంటూ సంబోధించారు. ఇలా మాట్లాడటం ఇండియన్ మెంటల్ యాక్ట్ ను ఉల్లంఘించినట్లు. యాంకర్ అలా మాట్లాడటంతో పదేపదే విశ్వక్ సేన్ మాటలు అదుపులో ఉంచుకొని డిప్రెషడ్ గురించి మాట్లాడే హక్కు లేదని తెలియజేశాడు.
విశ్వక్ సేన్ మాటలు నచ్చలేదు యాంకర్ తనని స్టూడియో నుంచి బయటకు వెళ్ళమని అరిచారు. ఆ సమయంలో హీరో విశ్వక్ సేన్ F*** అనే అభ్యంతరకర పదాన్ని ఉపయోగించారు. అసలు ఆయనని డిబేట్ ఆహ్వానించింది టీవీ9 వాళ్ళు రమ్మని ఆయన మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతూ బయటికి వెళ్ళడం తప్పు.
Advertisement
ఇలా జరిగిన ఈ మొత్తం వ్యవహారాన్ని టీవీ9 డిలీట్ చేసింది. అయితే ఈ వ్యవహారం జరగడానికి కారణం దేవి నాగవల్లి తనని డిప్రెషడ్ గెటవుట్ అనటం వల్లే తలెత్తింది. ఇక దేవి నాగవల్లి విశ్వక్ అన్న మాటలకు క్షమాపణ కూడా చెప్పారు. ఇక గతంలో జరిగిన విషయం గురించి ప్రస్తావిస్తూ డీజే టిల్లు సమయంలో దేవి నాగవల్లి ‘మీరు ఉమనైజరా? అని ప్రశ్నించడం ఎంతవరకు సబబు.
స్టూడియోలో విశ్వక్సేన్ విషయంలో దేవి నాగవల్లి చేసిన పనికి.. ఆమెకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలి. దాంతోపాటు ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రవర్తించినందుకు విశ్వక్ సేన్ కూడా సారీ చెప్పాలి. చివరికి దేవి నాగవల్లి చేసిన దాన్ని జర్నలిజం అనలేం అంటూ బాబు గోగినేని ఈ వ్యవహారంపై స్పందించారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.