Balagam director Venu : కమెడియన్ గా సినిమాల్లో ప్రయాణం మొదలు పెట్టి నేడు తెలుగు ప్రేక్షకుల మనసు హత్తుకునేలా సినిమా తీసిన డైరెక్టర్ వేణు. కమెడియన్ వేణు నుండి డైరెక్టర్ వేణు గారు వరకు తన ప్రయాణం, తాను పడిన కష్టాలు, ఇబ్బందులు, త్యాగాలు అన్నింటినీ ‘బలగం’ సినిమా సక్సెస్ అయ్యాక అందరి ప్రశంసలతో మర్చిపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో చెప్పిన వేణు యెల్దండి తన బలగం సినిమా ప్రయాణం గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ఎలా ఆదరిస్తున్నారు, తనకు వస్తున్న వేలాది రివ్యూల గురించి ఇంటర్వ్యూలో తెలిపారు వేణు. అలాగే తన బలగం సినిమా ప్రయాణం మొదటి అడుగు నుండి ఎలా పడిందో ఇంటర్వ్యూలో వివరించారు.
ఆర్టిస్టులను ఆరు నెలలు ఎంపిక చేశా…
సినిమాలో అందరి సహజమైన నటన ముఖ్యంగా ప్రేక్షకులను ఆకర్షస్తోంది. నిజానికి పేరున్న నటీనటులు కొద్ది మందే ఉన్నా అందరూ కొత్తవాళ్ళే అయినా కూడా అందరి నటన సినిమాను నిలబెట్టాయి. అలా సినిమా కోసం కథ సిద్ధమైయ్యాక ఆర్టిస్టులను ఎంపిక చేయడానికి దాదాపు ఆరు నెలల సమయం తీసుకున్నారట వేణు యెల్దండి. సినిమాల్లో ఆల్రడీ నటిస్తున్న వాళ్ళు కొంతమందైతే సురభి కళాకారులు కొంతమందిని తీసుకున్నారట. నాటక రంగంలో ప్రవేశమున్న కళాకారులను చాలా మందిని తీసుకోవడం వల్ల అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికీ మంచి పాత్ర రావడం వల్ల ఆకలితో ఉన్న పులికి వేట దొరికినట్లు అయిందని సూపర్ గా యాక్ట్ చేసారని, వజ్రల్లాంటి ఆర్టిస్టులు దొరికారంటూ చెప్పారు వేణు.
సినిమా కథ దిల్ రాజు గారికి మూడు గంటలు చెప్పానని, సినిమా కథ ఓకే అయ్యాక సుమారు ఆరు నెలలు ఆర్టిస్టుల ఎంపిక జరగడంతో ప్రొడక్షన్ వాళ్ళు నన్ను తిట్టుకున్నారు. దిల్ రాజు ఇంతమంచి అవకాశం ఇస్తే వీడు ఇలా చేస్తున్నాడేంటి అనుకున్నారు. కానీ ఆర్టిస్టుల సెలక్షన్ అంతా అయ్యాక షూటింగ్ అపుడు అలా అనుకున్నవాళ్లే వచ్చి ప్రశంసించారు అంటూ చెప్పారు వేణు.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…