Rashmika:రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కిరిక్ పార్టీ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఏప్రిల్ 5వ తేదీ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే అభిమానులు పెద్ద ఎత్తున రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విషయాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రష్మిక నటనలో ఎంతో టాలెంట్ కలిగిన హీరోయిన్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె యాక్టింగ్ లో మాత్రమే కాదు చదువులో కూడా ఎంతో టాలెంట్ కలిగి ఉన్నారని తెలుస్తోంది.
సాధారణంగా సెలబ్రిటీలకు చదువుపై ఇష్టం లేదనీ చెబుతూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం ఉన్నత చదువులు చదివి ఇండస్ట్రీలో స్థిరపడిన వారు ఉన్నారు. ఇక రష్మిక సైతం ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్యాచిలర్ డిగ్రీలను అందుకున్నారట. 1994 కూర్గ్ ప్రాంతంలో జన్మించిన రష్మిక తన స్కూల్ మొత్తం అక్కడే పూర్తి చేశారని తెలుస్తోంది. అనంతరం ఈమె బెంగళూరులోని రామయ్య డిగ్రీ కళాశాలలో ఏకంగా మూడు డిగ్రీ పట్టాలు పొందారని తెలుస్తోంది.
ఈమె ఈ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ పట్టా పొందారు. దీనితోపాటు జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో కూడా డిగ్రీ అందుకున్నారని తెలుస్తోంది.ఇలా ఏకంగా మూడు డిగ్రీలు అందుకున్నటువంటి రష్మిక ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇలా 2014 సంవత్సరంలో ఈమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ పోటీలలో పాల్గొని గెలుపొందారు. ఇలా ఈ పోటీలలో గెలవడంతో తనకు సినిమా అవకాశాలు వచ్చాయని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…