Balagam fame mime Madhusudhan : మైమ్ ట్రైనర్ గా మంచి గుర్తింపు ఉన్న నటుడు మైమ్ మధు ‘బలగం’ సినిమాతో మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మైమ్ ఆర్టిస్ట్ గానే కాకుండా మైమ్ ట్రైనర్ గా కూడా ఉన్న అరుసం మధుసూధన్ గారు ఆయన ప్రతిభకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకెడమీ అవార్డు, ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. ఇక ఆయన సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసారు. ఇక బుల్లితెర మీద కూడా చక్రవాకం, శ్రావణ సమీరాలు సీరియల్స్ లో నటించారు. ఇక వెండితెర మీద ఆకాశవాణి, గాలి సంపత్, చోర్ బజార్, తాజాగా బలగం సినిమాలో నటించారు. బలగంలో హీరో బాబాయ్ గా తాగుబోతుగా నటించిన ఆయన ఆ సినిమా అనుభవాలను పంచుకున్నారు.
వేణు మీద నమ్మకం కుదర్లేదు…
సినిమాలో నటించే అవకాశం ఆకాశవాణి సినిమా చూసి సెలెక్ట్ చేసారంటూ చెప్పారు మధు. ఇక సినిమా కథ విని కొంతమంది సినిమా చేయాలని అనుకుంటే మరికొంతమంది వేణు మీద నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే వీటన్నిటి వెనుక నిజానికి దిల్ రాజు బ్యానర్ బాగా ప్రభావం చూపింది.
అంత పెద్ధ బ్యానర్ లో సినిమా అనగానే అందరికీ ఒక భరోసా వచ్చింది. ఇక్కడ మెయిన్ హీరో దిల్ రాజుగారే. ఆయన కథ నచ్చి వేణు కి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. వేణు కి డైరెక్షన్ లో అనుభవం లేకపోయినా ఆయన కథను, వేణుని నమ్మాడు అంటూ చెప్పారు మధు. చాలా మంది వేణు వెనుక ఉన్న దిల్ రాజు గారి వల్లే సినిమా చేసారు అంటూ తెలిపారు.
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…