Balagam fame mime Madhusudhan : మైమ్ ట్రైనర్ గా మంచి గుర్తింపు ఉన్న నటుడు మైమ్ మధు ‘బలగం’ సినిమాతో మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మైమ్ ఆర్టిస్ట్ గానే కాకుండా మైమ్ ట్రైనర్ గా కూడా ఉన్న అరుసం మధుసూధన్ గారు ఆయన ప్రతిభకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకెడమీ అవార్డు, ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. ఇక ఆయన సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసారు. ఇక బుల్లితెర మీద కూడా చక్రవాకం, శ్రావణ సమీరాలు సీరియల్స్ లో నటించారు. ఇక వెండితెర మీద ఆకాశవాణి, గాలి సంపత్, చోర్ బజార్, తాజాగా బలగం సినిమాలో నటించారు. బలగంలో హీరో బాబాయ్ గా తాగుబోతుగా నటించిన ఆయన ఆ సినిమా అనుభవాలను పంచుకున్నారు.
వేణు మీద నమ్మకం కుదర్లేదు…
సినిమాలో నటించే అవకాశం ఆకాశవాణి సినిమా చూసి సెలెక్ట్ చేసారంటూ చెప్పారు మధు. ఇక సినిమా కథ విని కొంతమంది సినిమా చేయాలని అనుకుంటే మరికొంతమంది వేణు మీద నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే వీటన్నిటి వెనుక నిజానికి దిల్ రాజు బ్యానర్ బాగా ప్రభావం చూపింది.
అంత పెద్ధ బ్యానర్ లో సినిమా అనగానే అందరికీ ఒక భరోసా వచ్చింది. ఇక్కడ మెయిన్ హీరో దిల్ రాజుగారే. ఆయన కథ నచ్చి వేణు కి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. వేణు కి డైరెక్షన్ లో అనుభవం లేకపోయినా ఆయన కథను, వేణుని నమ్మాడు అంటూ చెప్పారు మధు. చాలా మంది వేణు వెనుక ఉన్న దిల్ రాజు గారి వల్లే సినిమా చేసారు అంటూ తెలిపారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…