Balagam fame mime Madhusudhan : మైమ్ ట్రైనర్ గా మంచి గుర్తింపు ఉన్న నటుడు మైమ్ మధు ‘బలగం’ సినిమాతో మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మైమ్ ఆర్టిస్ట్ గానే కాకుండా మైమ్ ట్రైనర్ గా కూడా ఉన్న అరుసం మధుసూధన్ గారు ఆయన ప్రతిభకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకెడమీ అవార్డు, ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. ఇక ఆయన సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసారు. ఇక బుల్లితెర మీద కూడా చక్రవాకం, శ్రావణ సమీరాలు సీరియల్స్ లో నటించారు. ఇక వెండితెర మీద ఆకాశవాణి, గాలి సంపత్, చోర్ బజార్, తాజాగా బలగం సినిమాలో నటించారు. బలగంలో హీరో బాబాయ్ గా తాగుబోతుగా నటించిన ఆయన ఆ సినిమా అనుభవాలను పంచుకున్నారు.
వేణు మీద నమ్మకం కుదర్లేదు…
సినిమాలో నటించే అవకాశం ఆకాశవాణి సినిమా చూసి సెలెక్ట్ చేసారంటూ చెప్పారు మధు. ఇక సినిమా కథ విని కొంతమంది సినిమా చేయాలని అనుకుంటే మరికొంతమంది వేణు మీద నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే వీటన్నిటి వెనుక నిజానికి దిల్ రాజు బ్యానర్ బాగా ప్రభావం చూపింది.
అంత పెద్ధ బ్యానర్ లో సినిమా అనగానే అందరికీ ఒక భరోసా వచ్చింది. ఇక్కడ మెయిన్ హీరో దిల్ రాజుగారే. ఆయన కథ నచ్చి వేణు కి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. వేణు కి డైరెక్షన్ లో అనుభవం లేకపోయినా ఆయన కథను, వేణుని నమ్మాడు అంటూ చెప్పారు మధు. చాలా మంది వేణు వెనుక ఉన్న దిల్ రాజు గారి వల్లే సినిమా చేసారు అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…