Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో ఉంటూ గత ఏడాది జూన్ 9వ తేదీ తనని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం జరిగిన నాలుగు నెలలకే కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు.
ఇలా తల్లిదండ్రులుగా మారిన నయనతార దంపతులు ప్రస్తుతం తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిపోయారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత నయనతార దంపతులు మొదటిసారి తమకుల దైవం ఆలయానికి వచ్చారు.
ఈ క్రమంలోనే ఈ దంపతులు కుంభకోణం సమీపంలో కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలను చేయించారు. అయితే గుడిలోకి నయనతార దంపతులు వచ్చారనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని గోల చేశారు. కనీసం పూజ కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వకుండా గోల చేశారు.
ఇలా అభిమానులు గోల చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఒక్కసారిగా ఆలయం గేటు వద్దకు వచ్చి అభిమానులపై మండిపడ్డారు.మేము కూడా పూజ కోసమే వచ్చాం ఐదు నిమిషాలు ఆగితే పూజ పూర్తి అవుతుంది కనీసం ఐదు నిమిషాలు ఎదురు చూడలేరా అంటూ అభిమానులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా నయనతార వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా అనంతరం విగ్నేష్ వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…