Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో ఉంటూ గత ఏడాది జూన్ 9వ తేదీ తనని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం జరిగిన నాలుగు నెలలకే కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు.
ఇలా తల్లిదండ్రులుగా మారిన నయనతార దంపతులు ప్రస్తుతం తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిపోయారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత నయనతార దంపతులు మొదటిసారి తమకుల దైవం ఆలయానికి వచ్చారు.
ఈ క్రమంలోనే ఈ దంపతులు కుంభకోణం సమీపంలో కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలను చేయించారు. అయితే గుడిలోకి నయనతార దంపతులు వచ్చారనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని గోల చేశారు. కనీసం పూజ కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వకుండా గోల చేశారు.
ఇలా అభిమానులు గోల చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఒక్కసారిగా ఆలయం గేటు వద్దకు వచ్చి అభిమానులపై మండిపడ్డారు.మేము కూడా పూజ కోసమే వచ్చాం ఐదు నిమిషాలు ఆగితే పూజ పూర్తి అవుతుంది కనీసం ఐదు నిమిషాలు ఎదురు చూడలేరా అంటూ అభిమానులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా నయనతార వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా అనంతరం విగ్నేష్ వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…