Posani Krishna Murali : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొస్తారు. విభిన్నంగా విలనిజం చూపిస్తాడు అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసే సమయంలోనే వర్మ సినిమాలో అవకాశం వచ్చినా పని పూర్తిగా నేర్చుకున్నాకే చేస్తానని చెప్పి తిరస్కరించిన పోసాని ఆ తరువాత గాయం, నాగార్జున రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్న పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆయన తన వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నా భార్య ఏదీ పట్టించుకోదు…
రాజకీయాల్లో ఉన్నాక మన మీద మాత్రమే కాకుండా మన కుటుంబం మీద కూడా బురద జల్లుతారు. ఈ విషయం నా కుటుంబానికి తెలుసు అందుకే నేను నా కుటుంబం పెద్దగా పట్టించుకోము అంటూ తెలిపారు పోసాని. ఒకానొక సమయంలో పోసాని గారిని ఆయన భార్య కుసుమ లతను టార్గెట్ చేసి కొంత మంది తిట్టినపుడు వాళ్లకు కౌంటర్ వేస్తూ పరుశంగా పోసాని గారు అయన భార్యనే విమర్శించారు.
ఆ వీడియో మళ్ళీ ఆయన భార్యకు చూపించినా ఒకసారి మొహం చిట్లించినట్లు పెట్టి తరువాత టీ తాగుతారా అంటూ తన పని తాను చేసుకుంది. తాను ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోదు, కుటుంబంలో అందరూ అంతే అంటూ తెలిపారు పోసాని. తాను కూడా ఎవరినీ ఊరికే విమర్శించనని కారణం ఉంటేనే వాళ్ళు చేసింది తప్పు అనిపిస్తేనే మాట్లాడుతా అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…