Balagam fame Vijayalakshmi : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా మేనత్త పాత్రలో నటించిన పోచవ్వకు కూడా మంచి పేరు వచ్చింది. నిజానికి మన కుటుంబ వ్యవస్థలో ఇంటి ఆడపిల్లకు చాలా ప్రముఖ్యత ఇస్తారు. ఇంట్లో ఏ వేడుక జరిగినా వాళ్ళు ఉండాల్సిందే, అలాంటిది బలగంలో మేనత్త పాత్రకు బాగా ప్రాముఖ్యం ఉంది. ఆ పాత్రకు ప్రాణం పోసారు విజయలక్ష్మి.
డైరెక్టరా అనుకున్నా…
సురభి నాటక మండలికి చెందిన విజయలక్ష్మి గారు పుట్టినప్పటి నుండి జీవితం రంగస్థలం మీదే అని చెప్పొచ్చు. రంగస్థలంలో కృష్ణుడుగా, లోహితస్యుడిగా నటించారు. విజయలక్ష్మి గారు నాటకాలు మాత్రమే కాకుండా హరికథలను కూడా చెప్పగలరు. తెలంగాణ పల్లెల్లో ఎన్నో హారికథ ప్రదర్శనలు ఇచ్చిన ఆమెకు గ్రాంధికం బాగా అలవాటు ఉండటం వల్ల తెలంగాణ నుడికారం మాట్లాడటం కష్టమేమో అనుకుందట మొదట్లో. అయితే హారికథలు చెప్పినపుడు తెలంగాణ పల్లెల్లో ఎక్కువగా తిరిగిన ఆమె అక్కడి స్త్రీలను ఎక్కువ గమనించేవారట. అలా ఆహార్యం, అలాగే డైలాగలను బాగా గుర్తు పెట్టుకోవడం వల్ల భాష మాట్లాడగలిగాను అంటూ తెలిపారు. బలగం సినిమా ఆడిషన్స్ కోసం హైదరాబాద్ లోని సురభి నాటక సంస్థ వారి కాలనీకి వెళ్లి అక్కడ ఆడిషన్స్ చేసినపుడు విజయలక్ష్మి గారు సెలెక్ట్ అయ్యారు.
జబర్దస్త్ లో కమెడియన్ గా తెలిసిన వేణు సినిమా డైరెక్టర్ అని చెప్పినపుడు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అతను ఆరు నెలలు తనకు నచ్చిన వారిని సినిమాలో పాత్రల కోసం ఎంపిక చేయడం చూసాక అతని కష్టం అర్థమైంది. ఐదేళ్ళు సినిమా కథ కోసం కష్టపడ్డారట వేణు అందుకే సినిమా అంత బాగా సహజంగా వచ్చింది అంటూ విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. ఇక సినిమాలో మా నటన అంత సహజంగా రావడానికి కారణం మాత్రం వేణు గారే కారణం అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…