Balagam fame Vijayalakshmi : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా మేనత్త పాత్రలో నటించిన పోచవ్వ కు కూడా మంచి పేరు వచ్చింది. నిజానికి మన కుటుంబ వ్యవస్థలో ఇంటి ఆడపిల్లకు చాలా ప్రముఖ్యత ఇస్తారు. ఇంట్లో ఏ వేడుక జరిగినా వాళ్ళు ఉండాల్సిందే అలాంటిది బలగంలో మేనత్త పాత్రకు బాగా ప్రాముఖ్యం ఉంది. ఆ పాత్రకు ప్రాణం పోసారు విజయలక్ష్మి.
రచ్చ రవి వల్లే ఈ అవకాశం…
విజయలక్ష్మి గారు సురభి నాటకమండలిలో పనిచేసే కళాకారిణి. ఆమె నాటక ప్రదర్శనలు అలాగే హారికథ చెప్పే కళాకారిణి. అయితే ఏ నాడూ తాను సినిమాల్లో ప్రయత్నించలేదు. కేవలం నాటకాలు వేసేవారు. అయితే బలగం సినిమా ఆడిషన్స్ కోసం డైరెక్టర్ వేణు యెల్దండి గారు సురభి కాలనీకి వచ్చినపుడు ఆడిషన్ లో పాల్గొని పోచవ్వ పాత్రకు సెలెక్ట్ అయ్యారు విజయలక్ష్మి. అయితే దీనంతటికీ కారణం మాత్రం రచ్చ రావినే అంటూ చెప్పారామె. జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి వేణు కి ఆర్టిస్టుల కోసం వెతుకుతున్న సమయంలో సురభి కళాకారులను చూడు నీ కథలోని పాత్రలకు బాగుంటారు అని చెబితే అక్కడికి వచ్చారట. లేకపోయింటే ఆ అవకాశం నాకు వచ్చేది కాదేమో అంటూ విజయలక్ష్మి తెలిపారు.
షూటింగ్ కి రూప లక్ష్మీ వచ్చింది…
విజయలక్ష్మి గారిని ఆడిషన్ లో సెలెక్ట్ చేసాక వర్క్ షాప్ కి రమ్మని కబురు పంపగా అక్కడ కొంతమంది ఆర్టిస్టులతో కలిసి డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేవారట. అపుడే రూప లక్ష్మి గారు కూడా చివరి రోజు వర్క్ షాప్ కి వచ్చి సీన్స్ ప్రాక్టీస్ చేశారని, తాను సెలెక్ట్ అయితే బాగుండని అనుకున్నాను అంటూ విజయలక్ష్మి తన మనసులోని మాట తెలిపారు. ఆమె కార్తీక మాసం పూజలు చేస్తుందనుకుంటా మొహానికి పసుపు పూసుకుని అచ్చం అమ్మవారిలాగానే వచ్చింది అంటూ తెలిపారు. అనుకున్నట్లే తానే లక్ష్మీ పాత్రకు సెలెక్ట్ అయింది అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…