Balakrishna -NTR: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగు పెట్టినటువంటి వారిలో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్ అంటే బాలకృష్ణ మొదటి నుంచి తనని కాస్త దూరం పెడుతున్నారని అర్థమవుతుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఏ వేడుక అయినా కూడా ఎన్టీఆర్ దూరం పెడుతూ రావడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈయన గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఇదివరకు పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు.
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిన విషయం మనకు తెలిసింది. అదే విధంగా ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇలా యాంకర్ గా కూడా ఎన్టీఆర్ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక బాలకృష్ణ ఎన్ని రోజులు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈయన అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ద్వారా హోస్టుగా తన టాలెంట్ ఏంటో బయట పెట్టారు.
తాజా సమాచారం ప్రకారం మరోసారి బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య పోటీ ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఈసారి సినిమాల పరంగా కాదని యాంకర్లుగా అబ్బాయి బాబాయ్ ఇద్దరు పోటీ పడబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఓటీటీలో ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమానికి అత్యధిక రేటింగ్ రావడం మనకు తెలిసిందే. మరి ఎన్టీఆర్ రంగంలోకి దిగడంతో బాలయ్య రికార్డులను బ్రేక్ చేస్తారా అంటూ వీరిద్దరి గురించి చర్చలు మొదలయ్యాయి.త్వరలోనే ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించబోయే కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…