Nandamuri Tejaswini : బాలయ్య అన్ స్టాపబుల్ విజయానికి కారణం ఆమెనా..? తండ్రికి ఏ మాత్రం తీసిపోని తనయ!

Nandamuri Tejaswini: నందమూరి నటసింహం ప్రస్తుతం అఖండ సినిమా విజయోత్సవం కావడమే కాకుండా మరోవైపు ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఈ కార్యక్రమం కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని దూసుకుపోతుంది. ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న టాక్ షో లలో బాలకృష్ణ టాక్ షో IMDB టాప్ 10లో ఉండటం విశేషం.

Nandamuri Tejaswini : బాలయ్య అన్ స్టాపబుల్ విజయానికి కారణం ఆమెనా..? తండ్రికి ఏ మాత్రం తీసిపోని తనయ!

ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి బాలకృష్ణ రెండవ కూతురు కూడా కారణమని చెప్పాలి. బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ప్రముఖ విద్యావేత్త ఎంవివిఎస్ మూర్తి మనవడు భరత్ ని వివాహం చేసుకున్నారు. అయితే తేజస్వినికి బాలయ్య బాబు టాక్ షో విజయవంతం అవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

Nandamuri Tejaswini : బాలయ్య అన్ స్టాపబుల్ విజయానికి కారణం ఆమెనా..? తండ్రికి ఏ మాత్రం తీసిపోని తనయ!

బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి తన చిన్న కూతురు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆమె క్రియేటివిటి వల్లే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హోస్టింగ్ చేస్తూ అద్భుతంగా.. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా తేజస్విని కెమెరా వెనక ఉంటూ కెమెరా ముందు తన తండ్రి విజయానికి కారణమైనదని తెలుస్తుంది.

Nandamuri Tejaswini : తండ్రికి ఏ మాత్రం తగ్గని తనయ..

ఈ విధంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోవడమే కాకుండా ఎంతో మంది సబ్ స్కైబర్లు దక్కించుకోవడంతో బాలకృష్ణ పారితోషికం కూడా పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని మొదట్లో ప్రకటించినప్పుడు బాలకృష్ణ ఏంటి? యాంకర్ గా చేయడం ఏంటి? అనే వాళ్లకు బాలయ్య దీటుగా సమాధానం చెప్పారు. ఇక అఖండ సినిమా కూడా విజయవంతం కావడంతో బాలకృష్ణ తర్వాత చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు.