General News

ఏపీ ప్రజలకు హై అలర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ మారాయి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కీలక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు పని చేసే వేళలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 23 శుక్రవారం నుంచి మే 15 వరకుఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేసింది.

కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలలో భాగంగా ఈ విధంగా బ్యాంకు పని వేళల్లో మార్పులు చేసినట్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ సూచనల మేరకు ఆదేశాలు జారీ చేసింది.బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, రెమిటెన్స్‌లు, ప్రభుత్వ లావాదేవీలను తప్పనిసరిగా కొనసాగించాలని, ఇతర సేవలను అవసరాన్నిబట్టి కొనసాగించాలని తెలిపారు.

బ్యాంకులకు కూడా అందరూ కాకుండా కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు మాత్రమే,బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని మిగిలినవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవసరాలను తీర్చుకోవాలని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ బ్యాంకులలో పనిచేసే ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కచ్చితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

బ్యాంకు పని వేళల్లో మార్పులు చేయడమే కాకుండా వర్క్ ఫ్రం హోం సదుపాయం కలిగిన వారికి వర్క్ ఫ్రం హోం నిర్వహించాలని, కేవలం తక్కువ మంది సిబ్బందితో బ్యాంకు సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.పెన్షన్, డీబీటీ వంటి చెల్లింపులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా నిధులు ఉంచుకోవాలని.. ఏటీఎంలు, వాటికి సంబంధించిన ఇతర సేవలు సాధారణంగానే కొనసాగుతాయన్నారు. అదేవిధంగా బ్యాంకుసమయాలలో మార్పులు చేసినట్లు ప్రజలందరికీ తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని
ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన ఆ లెజెండరీ నటి ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక అరుదైన పేరు కృష్ణవేణి. నేటి తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోయినా, ఒకప్పుడు…

3 minutes ago

సీతమ్మ వాకిట్లో క్యారెక్టర్ మిస్సైన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా…

10 minutes ago

కోపంతో కారు దాడి… గురుగ్రామ్ ఘటన వైరల్

హర్యానాలోని గురుగ్రామ్లో నడిరోడ్డుపై జరిగిన ఓ విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు తమ ఎస్‌యూవీ కార్లతో…

17 minutes ago

బట్టతలకు బ్రేక్..సహజ చికిత్సలతో జుట్టు మళ్లీ దట్టంగా..

ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, బట్టతల సమస్యలు పెరుగుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి…

41 minutes ago

ఒరాకిల్ నుంచి ఔట్.. కానీ టెన్షన్ జీరో..ఉబర్ డ్రైవర్‌గా మారిన టెకీ స్టోరీ వైరల్..

టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి రోజురోజుకు పెరుగుతోంది. భారీ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో చాలా మంది…

1 hour ago

భోజనం తర్వాత ఈ చిన్న అలవాటు… పెద్ద ఆరోగ్య లాభాలు!

భోజనం అనంతరం సోంపు గింజలు తినడం అనేది చాలా మంది ఇళ్లలో సాధారణంగా కనిపించే అలవాటు. కానీ ఇది కేవలం…

2 hours ago