General News

15 ఏళ్లుగా ఉద్యోగానికి వెళ్లకుండానే జీతం.. చివరికి ఇలా?

మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక రోజు విధులకు హాజరు కాకపోతే నే ఆఫీస్ నుంచి మనకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. ఈ క్రమంలోనే ఒక వారం రోజుల పాటు ఆఫీస్ కి వెళ్లకుండా ఉంటే విధుల నుంచి మనల్ని బహిష్కరిస్తారు. కానీ ఓ వ్యక్తి గత పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యోగానికి వెళ్లకున్నా అతనిని ఎవరూ గుర్తించలేదు, పైగా నెల నెల అతనికి జీతం కూడా పడుతూనే ఉంది. వినడానికి ఎంతో ఆశ్చర్యం కలిగించే ఈ సంఘటన ఇటలీలోని పుగ్లీసీ సియాసియో ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాటాన్జారోలోని కాలాబ్రియన్ నగరంలో ఉన్న ఈ ఆసుపత్రిలో 2005వ సంవత్సరం నుంచి ఓ వ్యక్తి విధులకు హాజరు కావడం లేదు. ఈ వ్యక్తి విధులకు హాజరు కావడం లేదనే విషయాన్ని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ గుర్తించలేకపోయింది. అతడు విధులకు రాకున్నా, అటెండెన్స్ మాత్రం ఉండేది. ఈ విషయంపై ఆరా తీసిన అధికారులు అతడు కొన్ని విధానాలను పాటించాడని తెలుస్తోంది. అసలు విషయం బయట పడటంతో ఆ వ్యక్తి తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆసుపత్రి యాజమాన్యాన్ని బెదిరించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆ డైరెక్టర్ పదవి విరమణ పొంది ఆ స్థానంలో
హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ అతడి అటెండెన్సులో లోపాలను గుర్తించలేకపోయింది. ఫలితంగా గత 15 సంవత్సరాల నుండి ప్రతి నెల జీతం పడుతూ ఉంది. 15 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి సుమారుగా రూ.4.85 కోట్ల రూపాయల జీతం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ విషయం బయట పడటంతో అధికారులు అతనిని విధుల నుంచి బహిష్కరించారు. అదేవిధంగా ఆస్పత్రిలో ఉన్న ఆరుగురు హెచ్ఆర్ లను ఆరా తీస్తున్నారు. ఇందులో కచ్చితంగా ఎవరో ఒకరి సహాయ సహకారం లేనిదే ఆ వ్యక్తి ఇటువంటి దారుణానికి పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఆ నిందితుడి వయస్సు 67 సంవత్సరాలు కాగా అతనికి కోర్టు ఏమైనా శిక్షను విధిస్తుందా లేకపోతే అతడు విధులకు హాజరు కాకపోయినా ప్రతి నెల జీతం చెల్లిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రినుంచి జరిమానా వసూలు చేస్తుందనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

20 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

21 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago