Health: ఈ లక్షణాల కారణంగా..! కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..! ఏంటంటే..?
Health: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇటీవల కాలంలో ఆహార అలవాట్లు, వర్క్ ప్రెషర్, దురలవాట్ల కారణంగా కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. జీవ క్రియలు గతి తప్పినప్పుడు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి.
ముఖ్యంగా మూత్రంలో మంట, శరీరం పొడిబారటం, కడుపునొప్పి, నడుంనొప్పి, శరీరం దురదలు వస్తుండటం, కాళ్లు, చేతులు వాపులకు గురవ్వడం వంటి లక్షణాలు కనిపించినప్పడు కిడ్నీ సంబంధింత వ్యాధులు ఎటాక్ అవుతున్నాయని ప్రజలు గుర్తించాలి.
విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల ఒక్కోసారి కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. దీంతో పాటు అతిగా మద్యం సేవించడం వల్ల, ధూమపానం వల్ల కిడ్నీల ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. చాలా వరకు కిడ్నీ ఫెయిల్యూర్స్ వ్యాధులు మనకు తెలియకుండానే కొన్ని ఏళ్లుగా వస్తుంటాయి. చాలా మంది వీటిని చివరి స్టేజ్ లో గుర్తించడం వల్ల సరైన వైద్యం అందించినా… ఫలితం లేకుండా పోతోంది.
సరైన నిద్ర రోజుకు ఏడు నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. ఇలా లేకపోతే దీర్ఘాకాలంలో కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీపీ, షుగర్ వ్యాధి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. బీపీ, షుగర్ లెవల్స్ ఉన్నవారు కిడ్నీల పనితీరును ఎప్పటికప్పుడు నిశితంగా పరీక్షించుకోవాలి. దీంతో పాటు అనవసర ఒత్తిడి మూలంగా కూడా కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతోంది. సరైన వ్యాయామం వల్ల, ఫ్యాటీ ఫుడ్, ఉబకాయం తగ్గించుకోవడం వంటి మంచి అలవాట్లను పాటించడంతో పాటు రోజుకు అవసరమైన నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరును క్రమబద్ధీకరించుకోవచ్చు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…