General News

Crime: పగలు భిక్షగాడు..! రాత్రి అయిందంటే చాలు పట్ట పగ్గాలు ఉండవు..!

Crime: పగటి పూట యాచకుడిగా.. రాత్రి పూట దొంగ మారుతున్న ఓ వ్యక్తి చివరికి ఓ వ్యక్తి ప్రాణాలను తీశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులే టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతున్నాడు… ఈక్రమంలో ఓ వ్యక్తి మరణానికిి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ తిరుమలగిరి సమీపంలోని కానాజీగూడకు చెందిన వరగంధం రాఘవుల నర్సింహ అలియాస్ నర్సింగ్(32) యాచకుడిగా జీవిస్తున్నాడు.

పగటి పూట సిగ్నళ్ల వద్ద యాచిస్తూ.. అక్కడే పుట్ పాత్ పై జీవిస్తున్నాడు. గతంలో అతని భార్య విడిచివెళ్లినందుకు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే గాయాలతో బయటపడ్డాడు.  ఇదిలా ఉంటే రాత్రి వేళ మాత్రం తనలోని మరో రూపాన్ని చూపిస్తుంటాడు నర్సింగ్.

మద్యం మత్తులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులనే టార్గెట్ గా చేసుకుంటూ.. దోపిడీలకు పాల్పడుతున్నాడు. మద్యం మత్తులో వెళ్లేవారిని అటకాయించి.. బెదిరించి వారివద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్లను దోపిడీ చేస్తున్నాడు. అలాగే పుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లను దొంగిలిస్తున్నాడు.ఇలాగే గతేడాది డిసెంబర్ 14న రాత్రి సమయంలో కొత్తపేట సమీపంలోని మార్గదర్శి కాలనీకి చెందిన అలుగుబెల్లి కృష్ణారెడ్డి(48) మెట్రోస్టేషన్ వద్ద మద్యం సేవించి ఇంటికి వెళ్లడాన్ని గమనించిన నర్సింగ్… తన పాతపంథాలో భయపెట్టి దోచుకునేందుకు ప్రయత్నించాడు.

అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు…

అయితే కృష్ణారెడ్డి పెద్దగా పట్టించుకోవకపోవడంతో అతనిపై దాడి చేశారు. ఈక్రమంలో కృష్ణారెడ్డి తల పుట్ పాత్ ను ఢీకొనడంతో తీవ్రగాయాలయి అక్కడే పడిపోయాడు. అతని వద్దనున్న సెల్ ఫోన్, రూ.100 నగదు దోచుకున్న నర్సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారేదాకా అక్కడే గాయాలతో పడి ఉన్న కృష్ణారెడ్డిని కుటుంబ సభ్యులు వనస్థలి పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ… కృష్ణారెడ్డి 15 రోజుల తరువాత డిసెంబర్ 30న మరణించారు.  అయితే చోరికి గురైన మృతుడి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే మరొక వ్యక్తి ఫోన్ లిఫ్టు చేసి.. తనకు ఈ ఫోన్ దొరికిందని బుకాయించాడు. అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలిస్తే.. నర్సింగ్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. పుటేజీలో నిందితుడి ఫోటో ఆధారంగా.. ఆ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా కూపీలాగిన పోలీసులు నిందితుడు నర్సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చోరీ చేసిన ఫోనును ఎల్బీనగర్ లో రూ. 300 విక్రయించగా.. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

8 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago