Bhanu Chander : ఓ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సుమన్, భానుచందర్ ఇద్దరు కాస్త విరామం దొరకడంతో.. మధ్యాహ్నం యూనిట్ సభ్యులు లంచ్ ఏర్పాటు చేశారు. టేబుల్ పై భోజనం చేస్తున్న సుమన్ ని కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తున్న భానుచందర్ ను ఏమిటి అలా చూస్తున్నారని సుమన్ ప్రశ్నించాడు. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు తెలుగు సినిమాల్లో ఎందుకు నటించకూడదని సుమన్ ను భానుచందర్ ఆతృతగా అడిగాడు. నాకు తెలుగు భాషలో ఓనమాలు కూడా రావు అలాంటిది తెలుగు సినిమాలలో నటించగలనా అని సుమన్ నెమ్మదిగా బదులిచ్చాడు. నువ్వు తెలుగులో నటించు కేవలం మూడు నెలల్లో తెలుగు చాలా చక్కగా మాట్లాడుతావు. పైగా మాకు తెలుగు నేర్పించేంతగా భాషాపటిమ నీకు వస్తుందని సుమన్ తో భానుచందర్ చెప్పారు.
అలా అన్నదే తడవుగా సుమన్ ని వెంటపెట్టుకొని తెలుగు సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ను కలిసి సుమన్ ని తెలుగులో పరిచయం చేయాలని భానుచందర్ ఆయనను కోరారు. ఆ విషయం పట్ల స్పందించిన నిర్మాత భరద్వాజ్ సుమన్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. తమిళ సినిమా చేస్తున్న క్రమంలో ఒకరినొకరు కరాటేలో బ్లాక్ బెల్ట్ గా పరిచయం చేసుకుని అందులోని పోరాట సన్నివేశాలను వారిద్దరు చక్కగా చేశారు.ఆ క్రమంలో అప్పటి అప్ కమింగ్ రైటర్ భరత్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మంచి కథ తయారు చేశారు. కథ మాటలు చక్కగా కుదరడంతో ఈ సినిమాకి దర్శకునిగా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా ఎదుగుతున్న రేలంగి నరసింహారావు ని తీసుకున్నారు.
1983 చరితచిత్ర బ్యానర్, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాణం, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో “ఇద్దరు కిలాడీలు” చిత్రం విడుదలయ్యింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తరంగిణి చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సుమన్, శ్యామల గౌరీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దాదాపు 300 రోజులు ఆడింది. ఇలా వీరి కాంబినేషన్ లో అనేక చిత్రాలు ఆ తర్వాత కూడా విడుదలయ్యాయి. అలా ఒక రోజు మద్రాస్ లో పాండీ బజార్ వద్ద కారులో వస్తున్న భానుచందర్ కి ఎదురుగా మరో కారులో వస్తున్న సుమన్ ఢీకొట్టేంత దగ్గరగా వచ్చాడు. ఎవరో అనుకొని భానుచందర్ కారు డోర్ తీసుకొని కోపంగా అరవపోయాడు.
కానీ తీరా చూస్తే ఎదుటి కారులో సుమన్. ఆయన కారు దిగి.. భాను ఇక నన్ను ఎప్పుడు కలవకు.. ఫోన్ కూడా చేయకు అని చెప్పడంతో నేను ఎంతో షాక్ అయ్యాను. అసలేం జరిగిందని సుమన్ ని ఆరా తీయగా.. నన్ను ఒక కేసులో ముద్దాయిగా చేర్చారని నాతో నువ్వు క్లోజ్ గా ఉంటున్నావ్ కాబట్టి నిన్ను కూడా అందులో చేర్చే అవకాశం ఉందని నన్ను కొద్ది రోజులు కలవకు వీలైతే ఫోన్ కూడా చేయకు అని సుమన్ చెప్పారు. అలాంటి మంచి స్నేహితుడు సుమన్. సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా నా గురించి సుమన్ ఆలోచించారు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో బాపూ, రమణల స్నేహం గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఆ తర్వాత స్నేహమంటే మా ఇద్దరిదేనని ఆ ఇంటర్వ్యూలో భానుచందర్ చెప్పుకొచ్చారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…