Bhanu Chander : ఓ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సుమన్, భానుచందర్ ఇద్దరు కాస్త విరామం దొరకడంతో.. మధ్యాహ్నం యూనిట్ సభ్యులు లంచ్ ఏర్పాటు చేశారు. టేబుల్ పై భోజనం చేస్తున్న సుమన్ ని కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తున్న భానుచందర్ ను ఏమిటి అలా చూస్తున్నారని సుమన్ ప్రశ్నించాడు. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు తెలుగు సినిమాల్లో ఎందుకు నటించకూడదని సుమన్ ను భానుచందర్ ఆతృతగా అడిగాడు. నాకు తెలుగు భాషలో ఓనమాలు కూడా రావు అలాంటిది తెలుగు సినిమాలలో నటించగలనా అని సుమన్ నెమ్మదిగా బదులిచ్చాడు. నువ్వు తెలుగులో నటించు కేవలం మూడు నెలల్లో తెలుగు చాలా చక్కగా మాట్లాడుతావు. పైగా మాకు తెలుగు నేర్పించేంతగా భాషాపటిమ నీకు వస్తుందని సుమన్ తో భానుచందర్ చెప్పారు.
అలా అన్నదే తడవుగా సుమన్ ని వెంటపెట్టుకొని తెలుగు సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ను కలిసి సుమన్ ని తెలుగులో పరిచయం చేయాలని భానుచందర్ ఆయనను కోరారు. ఆ విషయం పట్ల స్పందించిన నిర్మాత భరద్వాజ్ సుమన్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. తమిళ సినిమా చేస్తున్న క్రమంలో ఒకరినొకరు కరాటేలో బ్లాక్ బెల్ట్ గా పరిచయం చేసుకుని అందులోని పోరాట సన్నివేశాలను వారిద్దరు చక్కగా చేశారు.ఆ క్రమంలో అప్పటి అప్ కమింగ్ రైటర్ భరత్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మంచి కథ తయారు చేశారు. కథ మాటలు చక్కగా కుదరడంతో ఈ సినిమాకి దర్శకునిగా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా ఎదుగుతున్న రేలంగి నరసింహారావు ని తీసుకున్నారు.
1983 చరితచిత్ర బ్యానర్, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాణం, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో “ఇద్దరు కిలాడీలు” చిత్రం విడుదలయ్యింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తరంగిణి చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సుమన్, శ్యామల గౌరీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దాదాపు 300 రోజులు ఆడింది. ఇలా వీరి కాంబినేషన్ లో అనేక చిత్రాలు ఆ తర్వాత కూడా విడుదలయ్యాయి. అలా ఒక రోజు మద్రాస్ లో పాండీ బజార్ వద్ద కారులో వస్తున్న భానుచందర్ కి ఎదురుగా మరో కారులో వస్తున్న సుమన్ ఢీకొట్టేంత దగ్గరగా వచ్చాడు. ఎవరో అనుకొని భానుచందర్ కారు డోర్ తీసుకొని కోపంగా అరవపోయాడు.
కానీ తీరా చూస్తే ఎదుటి కారులో సుమన్. ఆయన కారు దిగి.. భాను ఇక నన్ను ఎప్పుడు కలవకు.. ఫోన్ కూడా చేయకు అని చెప్పడంతో నేను ఎంతో షాక్ అయ్యాను. అసలేం జరిగిందని సుమన్ ని ఆరా తీయగా.. నన్ను ఒక కేసులో ముద్దాయిగా చేర్చారని నాతో నువ్వు క్లోజ్ గా ఉంటున్నావ్ కాబట్టి నిన్ను కూడా అందులో చేర్చే అవకాశం ఉందని నన్ను కొద్ది రోజులు కలవకు వీలైతే ఫోన్ కూడా చేయకు అని సుమన్ చెప్పారు. అలాంటి మంచి స్నేహితుడు సుమన్. సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా నా గురించి సుమన్ ఆలోచించారు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో బాపూ, రమణల స్నేహం గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఆ తర్వాత స్నేహమంటే మా ఇద్దరిదేనని ఆ ఇంటర్వ్యూలో భానుచందర్ చెప్పుకొచ్చారు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.