Bhanu Priya: వెండితెరపై నటిగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన కలువ సుందరి భానుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అద్భుతమైన నటనతో డాన్సులతో ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి నటి భానుప్రియ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలు అందరి సరసన ఎంతో అద్భుతమైన సినిమాలలో నటించారు. తెలుగులో మాత్రమే కాకుండా ఈమె తమిళం కన్నడ భాషలలో కూడా స్టార్ హీరోలు అందరి సరసన నటించారు.
ఇలా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలువురు యంగ్ హీరో హీరోయిన్లకు తల్లిగా కూడా నటించారు. అయితే గత కొంతకాలంగా భానుప్రియ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి భానుప్రియ తన గురించి మాట్లాడుతూ తను ఒక డిజాస్టర్ తో బాధపడుతున్నానని తెలిపారు.
2018లో తన భర్త ఆదర్శ కౌశల్ మరణించిన తర్వాత తన జ్ఞాపకశక్తి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చిందని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తాను మెమొరీ లాస్ డిసీస్ తో బాధపడుతూ అన్ని మర్చిపోతున్నానని తెలియజేశారు. ఈ క్రమంలోనే డాన్సులో హస్తముద్రికలు మర్చిపోయానని అదేవిధంగా ఒక తమిళ సినిమా షూటింగ్ జరుగుతుండగా చెప్పాల్సిన డైలాగులు అన్నిటిని కూడా మర్చిపోయానని తెలిపారు.
ఈ విధంగా తనకు ఏ విషయాలు గుర్తు లేవని ఈమె తెలియజేశారు. ప్రస్తుతం తాను ఈ వ్యాధికి మందులు వాడుతున్నానని అందుకే తాను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు.ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న తాను ఒక డాన్స్ స్కూల్ పెట్టాలని నిర్ణయాన్ని కూడా విరమించుకున్నానని తెలిపారు.ఇక ప్రస్తుతం తన కుమార్తె లండన్ లో ఉందని తనకు నటనపై ఏమాత్రం ఆసక్తి లేదంటూ ఈ సందర్భంగా భానుప్రియ వెల్లడించారు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…