Ycp Leader Karumuri Venkata Reddy : ఏపీ రాజకీయాల్లో అధికారపక్షమైన వైసీపీ లీడర్ల టార్గెట్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్. చిన్న లీడర్ల నుండి పెద్ధ నేతల వరకూ అందరూ పవన్ మీద విమర్శలు చేస్తున్నారు. కౌలు రైతులను ఆదుకోడానికి పవన్ కళ్యాణ్ సహాయం చేయగా ఆ విషయంలో అధికారపక్షాన్ని జనసేన నాయకులు విమర్శిస్తుండగా వైసీపీ నేతలు పవన్ మూడు పెళ్లిళ్ల ఇష్యూ నుండి మొదలు పెట్టి తాజాగా కొత్త పల్లవి అందుకున్నట్టు కనిపిస్తున్నారు. తాజాగా వైవీపీ లీడర్ కారుమూరి వెంకట రెడ్డి చేసిన వాఖ్యలు అలానే ఉన్నాయి.
లక్ష రూపాయలు పంచితే రాజకియనాయకుడు కాలేడు…
వెంకట రెడ్డి పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ లక్ష రూపాయలు ఎవరికో పంచగానే రాజకీయ నాయకుడు అయిపోలేడు. ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కౌలు రైతులకు అంటూ డబ్బు ఇస్తున్నా అంటున్నాడు, మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నపుడు కౌలు రైతులకు ఇవ్వవలిసిన నష్టపరిహారం ఇవ్వనప్పుడు ఏం చెసాడు అంటూ విమర్శించారు.
ముందు తన రోడ్డు షోల కోసం పిచ్చి అభిమానంతో వస్తున్న వారికి తొక్కిసలాటలో ఏదైనా అయితే వాటిని కాపాడమనండి అంటూ ఎద్దేవా చేసాడు. తన వాహనం వెనుక పిచ్చి అభిమానంతో పరిగెత్తుతూ ప్రాణాలు కోల్పోయేవారిని ఆదుకోమనండి అంటూ విమర్శించారు. ఇక లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ అసలు లోకేష్ అంటే ఎవరో తెలియదంటూ కామెంట్స్ చేశారు వెంకట రెడ్డి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…