Ycp Leader Karumuri Venkata Reddy : ఏపీ రాజకీయాల్లో అధికారపక్షమైన వైసీపీ లీడర్ల టార్గెట్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్. చిన్న లీడర్ల నుండి పెద్ధ నేతల వరకూ అందరూ పవన్ మీద విమర్శలు చేస్తున్నారు. కౌలు రైతులను ఆదుకోడానికి పవన్ కళ్యాణ్ సహాయం చేయగా ఆ విషయంలో అధికారపక్షాన్ని జనసేన నాయకులు విమర్శిస్తుండగా వైసీపీ నేతలు పవన్ మూడు పెళ్లిళ్ల ఇష్యూ నుండి మొదలు పెట్టి తాజాగా కొత్త పల్లవి అందుకున్నట్టు కనిపిస్తున్నారు. తాజాగా వైవీపీ లీడర్ కారుమూరి వెంకట రెడ్డి చేసిన వాఖ్యలు అలానే ఉన్నాయి.
లక్ష రూపాయలు పంచితే రాజకియనాయకుడు కాలేడు…
వెంకట రెడ్డి పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ లక్ష రూపాయలు ఎవరికో పంచగానే రాజకీయ నాయకుడు అయిపోలేడు. ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కౌలు రైతులకు అంటూ డబ్బు ఇస్తున్నా అంటున్నాడు, మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నపుడు కౌలు రైతులకు ఇవ్వవలిసిన నష్టపరిహారం ఇవ్వనప్పుడు ఏం చెసాడు అంటూ విమర్శించారు.
ముందు తన రోడ్డు షోల కోసం పిచ్చి అభిమానంతో వస్తున్న వారికి తొక్కిసలాటలో ఏదైనా అయితే వాటిని కాపాడమనండి అంటూ ఎద్దేవా చేసాడు. తన వాహనం వెనుక పిచ్చి అభిమానంతో పరిగెత్తుతూ ప్రాణాలు కోల్పోయేవారిని ఆదుకోమనండి అంటూ విమర్శించారు. ఇక లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ అసలు లోకేష్ అంటే ఎవరో తెలియదంటూ కామెంట్స్ చేశారు వెంకట రెడ్డి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…