Senior Actor Murali Mohan : 2022 సంవత్సరంను టాలీవుడ్ మర్చిపోలేదు. లెజెండ్రీ యాక్టర్స్ వరుసగా మరణించారు. కృష్ణం రాజుగారు, కృష్ణ గారు తక్కువ కాల వ్యవధిలో మరణించడం, ఆ తరువాత కొంత కాలానికి కైకాల సత్యనారాయణ గారు మరణించడం, అది మరువక ముందే చలపతిరావు గారు మరణించడం ఇలా వరుస విషాదలు టాలీవుడ్ ను కుదిపేసాయి. ఈ విషయం గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ వరుసగా లెజెండ్రీ యాక్టర్స్ మరణించడం దిగ్బ్రాంతికి గురి చేసిందని చెప్పారు.
మహేష్ బాధ ఎవరికీ రాకూడదు…
ఇక కృష్ణ, కృష్ణం రాజు ఇద్దరూ మురళీ మొహన్ గారికి మంచి మిత్రులు. అలాంటి ఇద్దరి మరణం బాగా బాధించిందంటూ చెప్పారు. ఇక కృష్ణ గారి గురించి మాట్లాడుతూ వరుసగా ఏడాదిలో కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు, ఆయన భార్య ఇందిరా దేవి మరణం వెనువెంటనే కృష్ణ గారి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అంటూ చెప్పారు. మహేష్ బాబు తన కుటుంబంలో ముగ్గురి మరణం ఒకే ఏడాది సంభవించడంతో క్రుంగిపోయాడంటూ తెలిపారు మురళీ మోహన్.
మహేష్ పైకి అలా ఉన్నా లోపల బాగా క్రుంగిపోయడని, కృష్ణ గారు మరణించినపుడు చూడటానికి వెళితే మహేష్ తన బాధను దిగమింగుకుని అందరితో మాట్లాడాడు. అయితే రాఘవేంద్రర్రావు ఒక్కసారిగా హత్తుకునే సరికి మహేష్ ఉద్వేగానికి గురయ్యాడు, బాధను అణిచిపెట్టుకోలేక పోయాడు. మహేష్ కి వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదు. ఒకే ఏడాది ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంత దారుణం. అంటూ మురళీ మోహన్ గారు ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…