Senior Actor Murali Mohan : 2022 సంవత్సరంను టాలీవుడ్ మర్చిపోలేదు. లెజెండ్రీ యాక్టర్స్ వరుసగా మరణించారు. కృష్ణం రాజుగారు, కృష్ణ గారు తక్కువ కాల వ్యవధిలో మరణించడం, ఆ తరువాత కొంత కాలానికి కైకాల సత్యనారాయణ గారు మరణించడం, అది మరువక ముందే చలపతిరావు గారు మరణించడం ఇలా వరుస విషాదలు టాలీవుడ్ ను కుదిపేసాయి. ఈ విషయం గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ వరుసగా లెజెండ్రీ యాక్టర్స్ మరణించడం దిగ్బ్రాంతికి గురి చేసిందని చెప్పారు.
మహేష్ బాధ ఎవరికీ రాకూడదు…
ఇక కృష్ణ, కృష్ణం రాజు ఇద్దరూ మురళీ మొహన్ గారికి మంచి మిత్రులు. అలాంటి ఇద్దరి మరణం బాగా బాధించిందంటూ చెప్పారు. ఇక కృష్ణ గారి గురించి మాట్లాడుతూ వరుసగా ఏడాదిలో కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు, ఆయన భార్య ఇందిరా దేవి మరణం వెనువెంటనే కృష్ణ గారి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అంటూ చెప్పారు. మహేష్ బాబు తన కుటుంబంలో ముగ్గురి మరణం ఒకే ఏడాది సంభవించడంతో క్రుంగిపోయాడంటూ తెలిపారు మురళీ మోహన్.
మహేష్ పైకి అలా ఉన్నా లోపల బాగా క్రుంగిపోయడని, కృష్ణ గారు మరణించినపుడు చూడటానికి వెళితే మహేష్ తన బాధను దిగమింగుకుని అందరితో మాట్లాడాడు. అయితే రాఘవేంద్రర్రావు ఒక్కసారిగా హత్తుకునే సరికి మహేష్ ఉద్వేగానికి గురయ్యాడు, బాధను అణిచిపెట్టుకోలేక పోయాడు. మహేష్ కి వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదు. ఒకే ఏడాది ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంత దారుణం. అంటూ మురళీ మోహన్ గారు ఎమోషనల్ అయ్యారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…