Senior Actor Murali Mohan : 2022 సంవత్సరంను టాలీవుడ్ మర్చిపోలేదు. లెజెండ్రీ యాక్టర్స్ వరుసగా మరణించారు. కృష్ణం రాజుగారు, కృష్ణ గారు తక్కువ కాల వ్యవధిలో మరణించడం, ఆ తరువాత కొంత కాలానికి కైకాల సత్యనారాయణ గారు మరణించడం, అది మరువక ముందే చలపతిరావు గారు మరణించడం ఇలా వరుస విషాదలు టాలీవుడ్ ను కుదిపేసాయి. ఈ విషయం గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ వరుసగా లెజెండ్రీ యాక్టర్స్ మరణించడం దిగ్బ్రాంతికి గురి చేసిందని చెప్పారు.

మహేష్ బాధ ఎవరికీ రాకూడదు…
ఇక కృష్ణ, కృష్ణం రాజు ఇద్దరూ మురళీ మొహన్ గారికి మంచి మిత్రులు. అలాంటి ఇద్దరి మరణం బాగా బాధించిందంటూ చెప్పారు. ఇక కృష్ణ గారి గురించి మాట్లాడుతూ వరుసగా ఏడాదిలో కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు, ఆయన భార్య ఇందిరా దేవి మరణం వెనువెంటనే కృష్ణ గారి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అంటూ చెప్పారు. మహేష్ బాబు తన కుటుంబంలో ముగ్గురి మరణం ఒకే ఏడాది సంభవించడంతో క్రుంగిపోయాడంటూ తెలిపారు మురళీ మోహన్.

మహేష్ పైకి అలా ఉన్నా లోపల బాగా క్రుంగిపోయడని, కృష్ణ గారు మరణించినపుడు చూడటానికి వెళితే మహేష్ తన బాధను దిగమింగుకుని అందరితో మాట్లాడాడు. అయితే రాఘవేంద్రర్రావు ఒక్కసారిగా హత్తుకునే సరికి మహేష్ ఉద్వేగానికి గురయ్యాడు, బాధను అణిచిపెట్టుకోలేక పోయాడు. మహేష్ కి వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదు. ఒకే ఏడాది ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంత దారుణం. అంటూ మురళీ మోహన్ గారు ఎమోషనల్ అయ్యారు.

































