కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏడో విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందని వార్తలు వస్తున్నా కేంద్రం నేడు అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమైంది. కేంద్రం అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేసి రైతులకు మరోసారి తీపికబురు అందించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో 6వ విడత పీఎం కిసాన్ నిధులు జమ కాగా నేడు మలి విడత నిధులు జమయ్యాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రతిసారి వివరాలను వెరిఫై చేసి కొత్తగా దరఖాస్తు చేసిన రైతుల దరఖాస్తులను పరిశీలించి రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో కేంద్రం నగదును జమ చేస్తోంది. దేశంలో దాదాపు పది కోట్ల మంది రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
ఎవరైన అర్హులై పీఎం కిసాన్ నగదు పొందలేదంటే ఆధార్ కార్డు అందజేయకపోవడం, ల్యాండ్ వివరాలు సరిగ్గా లేకపోవడం జరిగి ఉంటుంది. పీఎం కిసాన్ స్కీమ్ కు అర్హులైన వాళ్లు తమ ఖాతాల్లో నగదు జమ అయిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి beneficiary status అనే ఆప్షన్ ను ఎంచుకుని వివరాలను నమోదు చేయడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.
అర్హులై ఏ కారణం చేతనైనా ఖాతాలో నగదు జమ కాకపోతే 155261 లేదా 18001155266 నంబర్లకు ఫోన్ చేసి నగదు జమ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…