Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ 7 కార్యక్రమంలోకి ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన అనంతరం ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం సెలబ్రెటీ హోదాని అనుభవిస్తూ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు..
ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు తాను కనుక విజేతగా నిలబడితే నాకు వచ్చే ప్రైజ్ మనీ రైతుల కోసం ఇస్తానని పేద రైతులకు ఆ డబ్బును ఇచ్చి వారికి కుటుంబాలకు అండగా నిలబడతానని తెలిపారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయి దాదాపు మూడు నెలలు అయినప్పటికీ ఇప్పటివరకు ఈయన ఎవరికి సహాయం చేయలేదు.
ఈ విధంగా పల్లవి ప్రశాంత్ రైతులకు సహాయం చేయకపోవడంతో ఈయన గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. మాట ఇచ్చి మర్చిపోయారని చాలామంది ఈయన పట్ల ట్రోల్ చేశారు అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుచుకున్నటువంటి డబ్బును రైతులకు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
సందీప్ మాస్టర్ సహాయం..
ఈ క్రమంలోనే గజ్వేల్ లోని కొలుగూరు గ్రామానికి చెందినటువంటి ఒక రైతు కుటుంబానికి ఏకంగా లక్ష రూపాయల సహాయం అందించారు. తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల కోసం ఈయన లక్ష రూపాయలు సహాయం చేయడమే కాకుండా ఏడాదికి సరిపడా బియ్యం కూడా పంపించారు. అయితే ఈయనకు తోడుగా సందీప్ మాస్టర్ కూడా 25 వేల రూపాయలను ఆ కుటుంబానికి అందించటం విశేషం.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…