Bigg Boss : బుల్లితెర రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ షో అన్ని భాషల్లో ప్రసారమవుతున్న సంగతి తెలిసినదే. ఇక ఈ షో తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడవ సీజన్లో భాగంగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేరోజు పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ అభిమానుల మధ్య గొడవ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ గొడవలో భాగంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నటువంటి కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఇలా ఈ విషయం వివాదంగా మారటమే కాకుండా పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఇక ఈ అల్లర్లకు పాల్పడినటువంటి వారిని సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు గుర్తించి వారిపై కేసులను నమోదు చేస్తున్నారు. ఇలా ఈ సీజన్ ఈ స్థాయిలో గొడవలకు కారణం కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఈ కార్యక్రమం పట్ల షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని కంటెస్టెంట్లు బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున ర్యాలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ర్యాలీలు నిర్వహించకూడదు…
ఇలా ఇకపై ర్యాలీలు చేయకుండా వారిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేసుకునే సమయంలోనే అగ్రిమెంట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాలలో ఎవరు కూడా ర్యాలీ చేయకూడదని వారు హౌస్ లోకి వచ్చేటప్పుడు ఎలా గుట్టు చప్పుడు కాకుండా వస్తారో బయటకు వెళ్లేటప్పుడు కూడా అలాగే వెళ్లాలి అంటూ నిబంధనలను పెట్టబోతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…