Ariyana Glory: బావను ఆ స్థితిలో చూసే సరికి గుండె ముక్కలైంది: అరియానా
Ariyana Glory: తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం అవుతున్న షో రోజు రోజుకీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. విభిన్న టాస్క్ లతో పాటు, కంటెస్టంట్స్ గొడవలు, చిలిపి పనులతో ప్రేక్షకులను కట్టి పడేస్తున్నారు. ప్రతీ సీజన్ లో ఇప్పటి వరకు ది మోస్ట్ బెస్ట్ ఆర్ వరెస్ట్ మూమెంట్స్ చెప్పుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తారు. అలాగే ఈ సీజన్ లోనూ వారి ఇన్నర్ ఫీలింగ్స్ ను చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అందులో భాగంగా ఒక్కో కంటెస్టంట్ తమ తమ భావాలను వెల్లడించారు.
ఆ క్రమంలోనే అరియనా గ్లోరీ కూడా తన మనసులో ఇన్నాళ్లూ దాచుకున్న బాధను తెలుగు సినీ ప్రేక్షకుల ముందు చెప్పుకుని బోరున విలపించింది. అది తనకు, తన బావకు మధ్య సంఘటన అంటూ మొదలు పెట్టిన అరియానా, చిన్న తనంలోనే తండ్రి ప్రేమకు దూరమయ్యానని చెప్పుకొచ్చింది. తొమ్మిదో తరగతిలో తన బావతో ప్రేమాయణం మొదలైందని, తన పట్ల చూపించే ప్రేమా, కేరింగ్ చూసి అతనిపై ప్రేమ క్రమేణా బలపడిందని అరియానా తెలిపింది. అతనికి డిగ్రీ అయిపోయాక ఉద్యోగం వచ్చిందని, ఆ తర్వాత తామిద్దరం హైదరాబాద్ లో కలిసి ఉన్నామని చెప్పింది. మూడు సంవత్సరాలు బాగానే గడిచినా, ఆ తర్వాత తన బావకు తాను బోర్ కొట్టేసానని చాలా లేట్ గా తెలుసుకున్నానంటూ వాపోయింది.
ఒకానొక రోజు తన బావను చెప్పోకొలేని స్థితిలో, ఏ స్థితిలో చూడకూడదు అనుకున్నాననో అలా చూసి గుండె పగిలిపోయింది అంటూ అరియానా ఆవేధన వ్యక్తం చేసింది. కానీ మళ్ళీ అతను ఏదో సర్దిచెప్పే సరికి తానే కన్విన్స్ అయ్యి, మళ్ళీ అతనితో ఒక రెండు సంవత్సారాలు రిలేషన్షిప్ ను కంటిన్యూ చేశానని చెప్పింది.
ఇలా రోజులు గడుస్తున్న క్రమంలోనే తనకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని, కానీ తన బావ దాన్ని కూడా అనుమానించాడని అరియానా తెలిపింది. ఇక తాము ఇద్దరం కలిసి ఉండే ప్రసక్తి లేదని బ్రేకప్ చెప్పుకున్నామని ఆమె చెప్పింది. ఆ తర్వాత తాను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా బావ తనకు గుర్తొచ్చే వాడని, తన తప్పు లేకపోయినా తనను క్షమించమని తప్పైపోయింది అని ఎంత బతిమాలినా అతను సర్దుకో లేదని అరియానా తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…