Big Boss Ott Telugu: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన బిగ్ బాస్.. కంటెస్టెంట్ లు వీళ్లే?
Big Boss Ott Telugu: బుల్లితెరపై ప్రసారమవుతూ వివిధ భాషలలో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమం ఈసారి బుల్లితెరపై కాకుండా ఓటీటీలో ప్రసారం చేయడానికి సిద్ధమైంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని కంటెస్టెంట్ ల ఎంపిక కూడా జరుగుతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే ఈరోజు నాగార్జున తెలియజేశారు. ఫిబ్రవరి నెలలోనే బిగ్ బాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని నాగార్జున తెలియజేశారు.అయితే చాలామంది సీజన్ సిక్స్ ప్రారంభమవుతుందని భావించినప్పటికీ సీజన్ సిక్స్ కాకుండా ఈ కార్యక్రమం ఓటీటీలో ప్రసారం కాబోతుందని , దీనికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని వెల్లడించారు.
ఈ బిగ్ బాస్ కార్యక్రమం ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం గురించి వార్తలు రావడంతో ఈ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయానికి వస్తే…
యాంకర్ వర్షిని, యాంకర్ శివ, వరంగల్ వందన, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి, డీ 10 విన్నర్ రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమం కేవలం గంట మాత్రమే కాకుండా 24 గంటల పాటు లైవ్ రానున్నట్లు నాగార్జున ఇప్పటికే వెల్లడించారు. ఇక బిగ్ బాస్ ఫైవ్ కోసం నిర్మించిన ఇంటిలోనే కొన్ని మార్పులు చేసి ఓటీటీ బిగ్ బాస్ కార్యక్రమం కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…