Rajamouli: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ ఖర్చుతో ఒక చిన్న సినిమా తీయొచ్చు తెలుసా?
Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ , దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ” ఆర్ఆర్ఆర్ “. టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకుడు రాజమౌళి భారీగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఎటువంటి సినిమా అయినా కథ కథనం సంగీతం అన్ని ఎంత బాగా ఉన్న ప్రచారం చేయటం చాలా ముఖ్యం. ప్రచారం చేయటం వల్ల సినిమాని ప్రేక్షకులకు దగ్గర అ చేయవచ్చన్న ఆలోచనతో మన జక్కన్న ఈ సినిమా ప్రచారాన్ని వరుసగా తెలుగు ,తమిళం , కన్నడ ,మలయాళం , హిందీ భాషలలో భారీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ ప్రారంభించముందే ముంబైలో పీవీఆర్ కలిసి ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు చిత్ర యూనిట్. ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుండి ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భారీతనం చూపించటానికి దాదాపు ఇరవై నుండి 25 కోట్ల వరకు ఖర్చు చేశారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమా ట్రైలర్ ముంబైలో లాంచ్ చేసినప్పుడు ఆ ఈవెంట్ కోసం దాదాపు మూడు వేల మంది అభిమానుల్ని తెలుగు రాష్ట్రాల నుండి అక్కడికి తీసుకెళ్లారు. ఇలా చేయటం వల్ల ఆర్ఆర్ఆర్ హీరోలకు అక్కడ ఈ స్థాయి ఆదరణ లేదనే విషయం అందరికీ తెలిసిపోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , దానయ్య మాత్రమే కాకుండా వారి సహాయకులు కూడా వారి వెంట తిరుగుతూ ఉన్నారు.. వారందరి కోసం ప్రత్యేక విమానాలు బస్సులు బస చేయడం కోసం హోటల్ రూమ్స్ ఇలా అన్ని లెక్కలోకి వేసుకుంటే ఈ సినిమా మా ప్రమోషన్స్ కోసం పెట్టే ఖర్చుతో ఒక సినిమా తీయవచ్చు అని టాలీవుడ్ వర్గాలలో వినికిడి. ఈ మాత్రం బడ్జెట్ ప్రమోషన్స్ కోసం ఖర్చు చేయకపోతే సినిమా ప్రచారం ఈ రేంజ్ లో ఉండేది కాదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…