తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. కెప్టెన్స్ టాస్క్ గత రెండు రోజుల నుంచి నడిచింది. అందులో ఎట్టకేలకు విశ్వ కెప్టెన్ గా నిలిచాడు. అయితే ఈ టాస్క్ లో ఇంటి సభ్యుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. నాలుగు గ్రూపులుగా విడదీసిన బిగ్ బాస్ అందులో కాజల్, సిరిలను సంచాలకులుగా వ్యవహరించమన్నారు.
సంచాలకులుగా వాళ్లు వ్యవహరించే తీరు అక్కడ ఉన్న వాళ్లకు అస్సలు నచ్చలేదు. వారిపై విరచుకుపడుతూ కనిపించారు. గ్రీన్ టీం సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించడంతో వారు మిగిలిన మూడు టీమ్లలో తమకు నచ్చిన టీమ్ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు.
దీంతో యాంకర్ రవి.. తనకు బిగ్బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ ద్వారా ఎక్కువ బొమ్మలు తయారు చేసిన యానీ మాస్టర్ టీమ్ దగ్గర ఉన్న బొమ్మల్ని లాగేసుకున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. వాళ్లు పిల్లోకు సంబంధించి దూదిని బొమ్మలకు ఉపయోగించారు. దీంతో రవి టీంను బిగ్ బాస్ అనర్హులుగా ప్రకటించాడు. బిగ్ బాస్ హౌస్ కు సంబంధించిన ప్రాపర్టీని ఉపయోగించినందుకు ఆ పనిష్ మెంట్ ఇచ్చారు. వారిని నిలువరించడంలో విఫలమైన కాజల్, సిరిలను కూడా బిగ్ బాస్ అనర్హులుగా తేల్చాడు.
ఇదంతా చూస్తున్న సన్నీ.. యానీ మాస్టార్ ను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. రెడ్ టీంకు ఒక స్పెషల్ పవర్ లభించింది. దీంతో వాళ్లు షణ్ముఖ్ టీమ్ బొమ్మలను సగం చేసేశారు. దీంతో షణ్ముఖ్ టీం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇదంతా ఇలా ఉండగా.. సన్నీ అప్పుడప్పుడు హౌస్ లో కాస్త ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాడు. ఒక ప్రదేశంలో కాజల్ ను ఇమిటేట్ చేస్తూ.. చూపించడం నవ్వులు పూయించింది. అప్పుడప్పుడు సన్నీ పవన్ కళ్యాణ్ డైలగ్స్ చెబుతూ ఆహా అనిపించాడు.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…