మా ఎన్నికల తర్వాత ఎప్పుడూ లేనంతగా చిత్ర పరిశ్రమలో కొన్ని అంచనాలు, మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమలో దింవంగత దాసరికి ప్రత్యేక స్థానం ఉంది. అతడు ఎంతో మంది నటీనటులను పరిచయం చేశాడు. తెలుగు పరిశ్రమకు అతడు ఒక పెద్దన్నగా వ్యవహరించాడు. అతడు అకాల మరణం చెందిన తర్వాత సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కులేకుండా పోయింది.
ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మా ఎన్నికల వ్యవహారం కూడా తలో దిక్కుగా మారిపోయింది. అయితే అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? ఆ సమర్థత ఎవరికి ఉంది.. అనే ప్రశ్నలు ప్రతీ ఒక్కరికీ మెదులుతున్నాయి. మా ఎన్నికల తర్వాత మంచు విష్ణు అధ్యక్షుడిగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే దాసరి స్థానాన్ని చాలామంది చిరంజీవి తీసుకోవాలని కోరారు.
కానీ నాగబాబు చాలా సందర్భాల్లో మా అన్నయ్యకు వాటిపై ఆశ లేదు అనే సరికి చిరంజీవి ఫేవర్ వర్గం వెనక్కి తగ్గారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన చిరంజీవి మాత్రమే దాసరి స్థానాన్ని భర్తీ చేయగలడు అనేది వారి అభిప్రాయం. అయితే ప్రస్తుతం మా లో వేడి ఇంకా చల్లారలేదు. ఎన్నికల నిర్వహణపై ఒకరిపై ఒకరు దూషించుకుంటూనే ఉన్నారు. మంచు విష్ణును పీఠంపై కూర్చోబెట్టి.. మోహన్ బాబు చక్రం తిప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల టాక్.
దాసరి స్థానాన్ని మోహన్ బాబు భర్తీ చేయగలడనేది కొంతమంది సినీ ప్రముఖుల అభిప్రాయం. సినీ నటుడు నరేశ్ కూడా.. పెద్దన్నగా మోహన్ బాబు ఉండాలని ఎన్నో సార్లు చెప్పాడు. దీనిపై మోహన్ బాబు స్పందించలేదు కాని.. అతడి మనస్సులో కూడా అదే ఉందనేది తెలుస్తోంది. ఇటు వైపు అతడి విష్ణు అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి అతడు సినీ పెద్దలను కూడా కలుస్తున్నాడు. దీంతో మోహన్ బాబు తెలుగు సీని ఇండస్ట్రీకి పెదరాయుడు కావాలని అనుకుంటున్నట్లు కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…