అందరూ ఒకచోట చేరి సందడి చేసిన బిగ్ బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్స్..!

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా 9 వ వారం ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి 8 మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 11 మంది మాత్రమే హౌస్ లో మిగిలి ఉన్నారు. తొలి వారం సరయూ, రెండో వారం ఉమాదేవి, మూడో వారం ల‌హ‌రి, నాలుగో వారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్, ఐదోవారం హ‌మీదా, ఆరోవారం శ్వేతా వ‌ర్మ‌, ఏడో వారం ప్రియ‌, ఎనిమిదో వారం లోబో ఎలిమినేట్ అయిన విషయం అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు అందరూ కలిసి ఒకచోట చేరినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉమాదేవి, ప్రియ‌, శ్వేతా, స‌ర‌యు, హ‌మీదా,న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఇంట్లో క‌లిసిన‌ట్టు వైరల్ అవుతున్న ఫొటోల‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది.

వీరిని ఇలా చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.అయితే కేవలం ఈ సీజన్ మాత్రమే కాదు గతంలో జరిగిన నాలుగు సీజన్ లలో కంటెస్టెంట్లు కూడా స్నేహితులుగా మారి అప్పుడప్పుడు ఒకచోట చేరడం సరదా షికార్లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడం లాంటివి చూశాం.

అయితే, ఇప్పుడు ఇంకా సీజన్ పూర్తికాకముందే ఐదవ సీజన్ కంటెస్టెంట్లు ఇలా ఒకే చోట కలవడంతో వీరిమధ్య ఇంకా బాండింగ్ ఉన్నట్లుగా అభిమానులు ఫీలవుతున్నారు.అంతే కాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండ వచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ గెట్ టూ గెదర్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.