bihar assembly elections nitish kumar announces free electricity
పాట్నా, బీహార్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని ఆయన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ఈ పథకం ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని, దీని ద్వారా రాష్ట్రంలోని మొత్తం 1 కోటి 67 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని నితీష్ వెల్లడించారు.
నితీష్ కుమార్ తన పోస్ట్లో మాట్లాడుతూ, ఆగస్టు 1 నుండి అన్ని గృహ వినియోగదారులకు మొదటి 125 యూనిట్ల విద్యుత్తుకు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. “కుటిర్ జ్యోతి పథకం” కింద అత్యంత పేద కుటుంబాలకు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మిగిలిన వాటికి ప్రభుత్వం తగిన మద్దతును అందిస్తుందని పేర్కొన్నారు. దీని అర్థం గృహ వినియోగదారులు ఇకపై 125 యూనిట్ల వరకు విద్యుత్ కోసం ఎటువంటి ఖర్చును భరించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో 10,000 మెగావాట్ల వరకు సౌరశక్తి అందుబాటులో ఉంటుందని అంచనా వేయబడింది అని ఆయన వెల్లడించారు.
బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (అక్టోబర్, నవంబర్ మధ్య) జరగనున్న నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ వరుసగా సంచలన హామీలు ప్రకటిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అలాగే, వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఉచిత విద్యుత్ హామీతో నితీష్ కుమార్ ఎన్నికల బరిలో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…