bihar assembly elections nitish kumar announces free electricity
పాట్నా, బీహార్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని ఆయన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ఈ పథకం ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని, దీని ద్వారా రాష్ట్రంలోని మొత్తం 1 కోటి 67 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని నితీష్ వెల్లడించారు.
నితీష్ కుమార్ తన పోస్ట్లో మాట్లాడుతూ, ఆగస్టు 1 నుండి అన్ని గృహ వినియోగదారులకు మొదటి 125 యూనిట్ల విద్యుత్తుకు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. “కుటిర్ జ్యోతి పథకం” కింద అత్యంత పేద కుటుంబాలకు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మిగిలిన వాటికి ప్రభుత్వం తగిన మద్దతును అందిస్తుందని పేర్కొన్నారు. దీని అర్థం గృహ వినియోగదారులు ఇకపై 125 యూనిట్ల వరకు విద్యుత్ కోసం ఎటువంటి ఖర్చును భరించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో 10,000 మెగావాట్ల వరకు సౌరశక్తి అందుబాటులో ఉంటుందని అంచనా వేయబడింది అని ఆయన వెల్లడించారు.
బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (అక్టోబర్, నవంబర్ మధ్య) జరగనున్న నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ వరుసగా సంచలన హామీలు ప్రకటిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అలాగే, వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఉచిత విద్యుత్ హామీతో నితీష్ కుమార్ ఎన్నికల బరిలో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…